Bihar: తాగి ఆలస్యంగా వచ్చిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లంటే ఎంతో హడవిడి ఉంటుంది. అనుకున్న సమయానికి పెళ్లి జరగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం పెళ్లి ఏర్పాట్లు చకాచకా కానిస్తారు. కానీ.. ఇక్కడ ఓ వింత ఘటన జరిగింది. వరుడు మద్యం తాగి ఆలస్యంగా వచ్చాడని వధువు వివాహాన్ని రద్దు చేసింది. ఈ ఘటన బీహార్లోని కటిహార్లో జరిగింది. అంతేకాకుండా.. పెళ్లి ఏర్పాట్ల కోసం ఖర్చైన రూ. 4 లక్షలు ఇవ్వాలని వరుడు తల్లిదండ్రులను డిమాండ్ చేసింది.
పెళ్లికి వచ్చిన అతిధుల కోసం అమ్మాయి కుటుంబ సభ్యులు తమ స్టేటస్కు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. అయితే వరుడు మంజిత్ చౌదరి కుర్సేలలోని కళ్యాణ మండపంలో పెళ్లి ఊరేగింపుగా రావాలి. వధువు తరుఫు బంధువులు చాలా సేపు ఎదురుచూశారు. రాత్రి అయినా రాలేదు.. కోపంతో ఊగిపోతున్న బంధువులు చుట్టు పక్కల వెతికి చూడగా ఓ కారులో అపస్మారక స్థితిలో ఉన్నాడు. అయితే ఉదయం పెళ్లి మండపం దగ్గరికి తీసుకొచ్చి చూడగా వరుడు మద్యం మత్తులో ఉన్నాడు.
Also Read
BJP: కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేత
తనకు కాబోయే వరుడి పరిస్థితి చూసి వధువు మనీషా పెళ్లికి నిరాకరించింది. మంజిత్ కళ్యాణ మండపానికి వస్తుండగా మద్యం తాగించారని, పెళ్లి ఖర్చుల కోసం ఖర్చు చేసిన రూ.4 లక్షలను తన కుటుంబానికి ఇవ్వాలని వధువు తెలిపింది. డబ్బులు చెల్లించే వరకు మంజిత్తో పాటు అతని తల్లిదండ్రులను వదిలిపెట్టేది లేదని పేర్కొంది. దీంతో.. వరుడు తరుఫు బంధువులు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ ఘటనపై మంజిత్ చౌదరి మాట్లాడుతూ.. తాను పెళ్లి మండపానికి బయల్దేరే ముందు తన స్నేహితులు కారులోకి ఎక్కి మత్తు కలిగించే పదార్థాలను తినమని చెప్పారని అన్నాడు. వారు ఏమీ ఇచ్చారో నాకు తెలియదు.. కానీ అవి తినగానే మత్తులోకి జారుకున్నట్లు చెప్పాడు. మరోవైపు.. వధువు సోదరుడు మాట్లాడుతూ, మంజిత్ అనారోగ్యంతో ఉన్నట్లు తన కుటుంబ సభ్యులు అబద్ధం చెబుతున్నారని, అతను మద్యానికి బానిస అని అన్నాడు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!