Myanmar: బంగ్లాదేశ్కు పారిపోతున్న రోహింగ్యాలపై డ్రోన్ దాడి..200 మందికి పైగా మృతి
- మయన్మార్ నుంచి మరోసారి బాధాకరమైన వార్త
- మయన్మార్ విడిచి బంగ్లాదేశ్కు పారిపోతున్న రోహింగ్యాలపై డ్రోన్ దాడి
- ఇందులో 200 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోహింగ్యాలకు సంబంధించి మయన్మార్ నుంచి మరోసారి బాధాకరమైన వార్త వెలువడింది. మయన్మార్ విడిచి బంగ్లాదేశ్కు పారిపోతున్న రోహింగ్యాలపై డ్రోన్ల ద్వారా దాడులు చేశారు. ఇందులో 200 మందికి పైగా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. నాఫ్ నది గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవేశించేందుకు వారు ప్రయత్నించగా వారిపై దాడి జరిగింది. బంగ్లాదేశ్ సరిహద్దులో దాడి జరిగిందని సాక్షులు చెప్పారు. ఇది రాఖైన్ రాష్ట్రంలో జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా అధికారులు అభివర్ణించారు. గర్భిణీ స్త్రీతో పాటు ఆమె 2 ఏళ్ల కుమార్తె కూడా మరణించారని చెప్పారు. ఈ దాడికి మిలీషియా, మయన్మార్ సైన్యం పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దులు దాటేందుకు ప్రజలు వేచి ఉన్న సమయంలో ఈ దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. గత కొన్ని వారాలుగా మయన్మార్ మిలటరీ (జుంటా), అరాకన్ ఆర్మీ(రెబెల్స్) కు మధ్య భీకర పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ దాడి జరిగింది.
READ MORE: Bangladesh : బంగ్లాదేశ్లో హింస తర్వాత.. ఇప్పుడు మరో సంక్షోభం.. ప్రజల ఆరాటం దేనికంటే?
Also Read
- Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో.. మృతదేహాలు బురదలో చెల్లాచెదురుగా కనిపించాయి. వాటి చుట్టూ సూట్కేసులు, బ్యాక్ప్యాక్లు తేలియాడుతున్నాయి. ముగ్గురు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. 200 మందికి పైగా మరణించారని, మరొకరు 70 మందికి పైగా మరణించారని చెప్పారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ దాడి మయన్మార్ తీరప్రాంత నగరమైన మౌంగ్డావ్ వెలుపల జరిగింది. మహమ్మద్ ఇలియాస్ (35) అనే ప్రత్యక్ష సాక్షి, తన గర్భవతి అయిన భార్య, 2 సంవత్సరాల కుమార్తెను కోల్పోయాడు. డ్రోన్లు గుంపుపై దాడి చేయడం ప్రారంభించినప్పుడు.. తాను నదిలో వారితో నిలబడి ఉన్నానని ఇలియాస్ చెప్పాడు.
Drone attack
తాజావార్తలు
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
-
IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
-
New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
-
Team India: ఇండియా-A జట్టులోకి మరో ఆల్రౌండర్ .. హర్ష్ దూబే అవుట్..
-
Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!