Dr. Care Homeopathy: వైద్యులు అందించే సేవలను పురస్కరించుకుంటూ డాక్టర్ కేర్ హోమియోపతి వారి “థాంక్యూ డాక్టర్” కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజానికి వైద్యులు అందించే సేవలను పురస్కరించుకుంటూ డాక్టర్ కేర్ హోమియోపతి – కరీంనగర్లో “థాంక్యూ డాక్టర్” కార్యక్రమం జరిగింది. మార్చి 19వ తేదీన ఇండియాలోనే అతిపెద్ద హోమియోపతి క్లినిక్లలో ఒకటైన డాక్టర్ కేర్ హోమియోపతి, ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడంలో వైద్యులు అందించే సేవలను సత్కరించేందుకు “థాంక్యూ డాక్టర్” కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, డాక్టర్ కేర్ హోమియోపతి వైద్య బృందం ప్రపంచంలోని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అవగాహన కల్పిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Read Also: IPL 2024: బెంగళూరు మ్యాచ్లకు నీటి కష్టాలు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం!
Also Read
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
ఇక, డాక్టర్ కేర్ హోమియోపతి వ్యవస్థాపకుడు డాక్టర్ ఎ.ఎం. రెడ్డి గారు ప్రపంచ గతం, వర్తమానం మరియు భవిష్యత్తు ఆరోగ్య పరిస్థితులను పోల్చుతూ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు. “తరతరాలు గడిచేకొద్దీ ఆరోగ్య పరిస్థితులు క్షీణిస్తున్నాయి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి మరియు అధిక మందుల వినియోగం నేటి తరాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. అనవసరమైన పరిస్థితుల్లో మందులు వాడితే ఆరోగ్య పరిస్థితి మరింత దెబ్బతింటుంది” అని డాక్టర్ ఎ.ఎం. రెడ్డి గారు అన్నారు. దీనితో పాటు మెరుగైన ప్రపంచం కోసం జీరో మెడికల్ సిస్టమ్ (ZMS)ని ఎన్ను కోవడం చాలా
మెరుగైన పద్ధతి అన్నారు.
Read Also: Yarlagadda VenkatRao: యర్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ న్యాయవాది కేవీ రమణ..
అయితే, డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యుల బృందం మీడియాతో మాట్లాడుతూ నేటి ప్రపంచంలో హోమియోపతి ప్రాముఖ్యతను ప్రస్తావించారు. పాటలు మరియు నృత్య ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం ప్రారంభమైంది, ఇది ప్రేక్షకులను చాలా అలరించింది. జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సేకరించిన సమాచారంతో హాజరైనవారు చాలా సంతోషపడ్డారు. ఈ సందర్భంగా కోలుకున్న కొద్ది మంది రోగులు మాట్లాడుతూ తమ ఆరోగ్యాన్ని మెరుగుపరిచినందుకు డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వివిధ రోగులు వారి రికవరీ కథనాలను మరియు వారి జీవితాలు ఎలా పూర్తిగా మారాయో అన్న అనుభవాలను పంచుకున్నారు.
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!