DOST 2022 : తెలంగాణలో దోస్త్ తొలి విడత సీట్ల కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DOST 2022 First Phase Admissions Today
తెలంగాణలోని డిగ్రీ కళాశాలలోని సీట్ల భర్తీ ఇటీవల విద్యాశాఖ డిగ్రీ ఆన్లైన్ సర్వీసస్ తెలంగాణ( దోస్త్) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. నేడు డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దోస్త్ తొలి విడత సీట్లను కేటాయించనున్నారు. రేపటి నుంచి ఈనెల 18 వరకు ప్రవేశ ప్రక్రియ నిర్వహించనున్నారు అధికారులు. 4,68,880 సీట్ల భర్తీకి విద్యామండలి కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలోని కాకతీయ, ఉస్మానియా, శాతవాహన, తెలంగాణ, మహాత్మగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల పరిధిలోని 1,060 కాలేజీల్లో డిగ్రీ కోర్సుల్లో సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే.. బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేషనల్, బీకాం ఆనర్స్, బీఎస్డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇతర కోర్సుల్లో దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు అధికారులు.
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
మూడు లేదా నాలుగు విడతల్లో డిగ్రీ సీట్లను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. అయితే.. విద్యార్థి సీటు కేటాయింపుతో సంతృప్తి చెందితే, కళాశాల ఫీజు లేదా సీటు రిజర్వేషన్ ఫీజును ఆన్లైన్ ద్వారా రేపటి నుంచి 18వ తేదీ మధ్య చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థి తాను సెలెక్ట్ చేసుకున్న కళాశాలను సందర్శించి ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన ధృవీకరణ పత్రాలను సంబంధిత కళశాలలో సమర్పించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం