Doctor Negligence: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం? పురిటిలోనే మరణించిన బిడ్డ!
Doctor Negligence: ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటనకి ఇప్పుడు ఓ నిండు ప్రాణం భలి అయ్యింది. డెలివరీ కోసం గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరిన గర్భిణీ విల్లా రవళికి సరైన వైద్య సేవలు అందకపోవడంతో, పుట్టబోయే బిడ్డ మృతిచెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. విల్లా రవళిని నార్మల్ డెలివరీ కోసం వైద్యులు ఆసుపత్రిలో ఉంచినప్పటికీ, ఆమె ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో ఆపరేషన్ చేయాలని.. లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళతామని కుటుంబ సభ్యులు డాక్టర్లను అభ్యర్థించారు. కానీ, వైద్యులు వినిపించుకోకుండా బలవంతంగా నార్మల్ డెలివరీకి ప్రయత్నించారంటూ ఆరోపిస్తున్నారు.
ఈ ప్రయత్నాల్లో భాగంగా పురిటిలోనే శిశువు మృతిచెందిందని బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మరణానికి కారణమని బాధితులు మండిపడుతున్నారు. అంతేకాకుండా, తమ చేతిలో మృత శిశువును పెట్టి “ఏం చేసుకుంటారో చేసుకోండి” అంటూ వైద్యులు బెదిరించారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం న్యాయం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదలమని వారు తెగేసి చెబుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read
తాజావార్తలు
-
Air Cooler: రోజుకు 8 గంటలు కూలర్ ఆన్లో ఉంటే ఎంత బిల్లు వస్తుందో తెలుసా?
-
Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
-
Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం… పగలు సెగలు..సాయంత్రం జల్లులు
-
SRH vs KKR IPL 2026: అరుదైన రికార్డు సాధించిన సునీల్ నరైన్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా..
-
Donald Trump: జర్మనీకి డబుల్ షాక్ ఇచ్చిన ట్రంప్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!