సినీ ఇండస్ట్రీ స్టార్స్ కి సంబంధించి ఏ విషయం అయినా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా ఎన్టీఆర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఓ చిన్న పాపతో ఎన్టీఆర్ ఆడుకుంటున్న ఫోటో బాగా వైరల్ అవుతుంది.. ఎన్టీఆర్, పాప నవ్వులు చిందిస్తున్న ఆ ఫోటో ఎంతో అద్భుతంగా ఉంది. దీంతో ఈ ఫోటోను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ ఒడిలో ఉన్న ఆ అమ్మాయి ఎవరని ఆరా తీయడం కూడా మొదలుపెట్టారు.దీనికి జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ ఒడిలో ఉన్న పాప తన మేనకోడలు అని కామెంట్ చేశాడు. రామ్ ప్రసాద్ ట్వీట్ తో ఆ పాప ఎవరో తెలిసిపోయింది.. ఎన్టీఆర్ ని కలిసిన ఆ పాప చాలా లక్కీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వారు ఎప్పుడు..ఏ సందర్భంలో కలిశారు అనేది మాత్రం రామ్ ప్రసాద్ వెల్లడించలేదు.
ఎన్టీఆర్ ఇటీవల సైమా అవార్డ్స్ వేడుకల్లో పాల్గొని దుబాయ్ నుండి తిరిగి వచ్చారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటనకు గానూ ఆయనకు ఉత్తమ నటుడుగా సైమా అవార్డు వచ్చింది ..టాలీవుడ్ నుండి ఈ అవార్డు కోసం రామ్ చరణ్, అడివి శేష్, నిఖిల్, సిద్దూ జొన్నలగడ్డ మరియు దుల్కర్ సల్మాన్ పోటీపడ్డారు. కానీ ఈ అవార్డు ఎన్టీఆర్ ను వరించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీ గా వున్నారు.. హైదరాబాద్ లో ఏకంగా బీచ్ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం..ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.దేవర సినిమా పక్కా యాక్షన్ చిత్రం గా తెరకెక్కుతుంది..ఈ సినిమా అధిక భాగం సముద్ర ప్రాంత సన్నివేశాలతో ఉంటుందని తెలుస్తుంది.దేవర మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. దేవర చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.దేవర సినిమా 2024 ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.