మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా కు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ ఇటీవలే వచ్చింది.గుంటూరు కారం అనే టైటిల్ ను ఈ సినిమా కు ఖరారు చేయడంతో పాటు పోస్టర్ ను మరియు వీడియోను కూడా విడుదల చేయడం కూడా జరిగింది. ఇక ఈ సినిమా లో హీరోయిన్స్ గా పూజా హెగ్డే మరియు శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే.మొదట పూజా హెగ్డేను మాత్రమే ఎంపిక చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత శ్రీ లీల ను కూడా తీసుకున్నారు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమా లో సెకండ్ హీరోయిన్ పాత్రకు అంతగా అయితే ప్రాముఖ్యత ఉండదు. కనుక గుంటూరు కారం సినిమా లో శ్రీలీల కు పెద్దగా ప్రాముఖ్యత ఉండక పోవచ్చు అనే అభిప్రాయంను చాలా మంది ఉంది..
సోషల్ మీడియాలో ప్రస్తుతం శ్రీ లీలకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..వరుస సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ శ్రీలీల సెకండ్ హీరోయిన్ పాత్రలు చేయాల్సిన అవసరం ఏంటి అని కూడా కొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి శ్రీలీల వరుసగా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో చిన్న పాత్రల్లో నటించేందుకు ఓకే చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీల మొదటి సినిమా పెళ్లి సందడి ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే.. అయినా కూడా టైం కలిసి వచ్చి ఆమెకు వరుసగా ఆఫర్లు అయితే వస్తున్నాయి. ఈ సమయంలో శ్రీ లీల కచ్చితంగా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బాలయ్య కు కూతురుగాఅలాగే మహేష్ సినిమా లో సెకండ్ హీరోయిన్ గా నటించడం వల్ల కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా డ్యామేజీ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై అయినా శ్రీ లీల కథ విషయంలో కొంత జాగ్రత్త లు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.