DMK Leader on Khushboo: సినీ నటి ఖుష్బూ పెద్ద ఐటమ్.. డీఎంకే నేత వివాదస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK Leader on Khushboo: సినీ నటి ఖుష్బూపై డీఎంకే నేత సైదైయ్ సాదిక్ వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీలోని ఖుష్బూ, నమిత, గౌతమి, గాయత్రీ రఘురామన్లు ఐటమ్స్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఖుష్బూ పెద్ద ఐటమ్ అంటూ మాట్లాడారు. అమిత్ షా తలమీద వెంట్రుకైనా మొలుస్తేందేమో కానీ.. తమిళనాడులో కమలం మాత్రం వికసించదన్నారు. డీఎమ్కే నేత మాటలపై సినీ నటి ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Piyush Goyal: ప్రధాని మోడీ విజన్తో పనిచేస్తున్నారు.. భారత్ దూసుకుపోతోంది..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఓ మనిషిగా, మహిళగా బహిరంగ క్షమాపణ చెబుతున్నానని డీఎంకే సీనియర్ నాయకురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోదరి కనిమొళి అన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోరని ఆమె చెప్పారు. ప్రముఖ నటి, భాజపా నేత ఖుష్బు సుందర్ ట్విటర్ ద్వారా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. ‘‘ మహిళలను పురుషులు దుర్భాషలాడారంటే….వారు ఎలాంటి వాతావరణంలో పుట్టిపెరిగారో అర్థమవుతుంది. ఇలాంటివారే మహిళల గర్భాన్ని అవమానిస్తారు. ఇదేనా ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో విరాజిల్లుతున్న ద్రవిడ సంస్కృతి? అని ట్విటర్ వేదికగా కనిమొళి విమర్శలు గుప్పించారు.
అనంతరం డీఎంకే నేత సైదైయ్ సాదిక్ కూడా క్షమాపణలు చెప్పారు. ఏ నాయకుడిని బాధపెట్టాలని తాను ఉద్దేశించలేదని అన్నారు. కుష్బూతో సహా ఏ నాయకుడిని బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని, గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నానని సాదిక్ అన్నారు. అయితే బీజేపీ అధిష్టానం చేసిన వ్యాఖ్యలపై ఎవరూ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టీఎన్బీజేపీ చీఫ్ అన్నామలై డీఎంకే మంత్రులను పందులు, జంతువులు అన్నారని.. జర్నలిస్టులను కోతులతో పోల్చాడని.. ఈ బీజేపీ నేతలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని అని సైదైయ్ సాదిక్ ప్రశ్నించారు. నమిత, ఖుష్బు సుందర్, గౌతమి, గాయత్రి రఘురామన్లను ఉద్దేశించి డీఎంకే నేత సైదైయ్ సాదిక్ తమిళనాడులో నటిగా మారిన బీజేపీ నేతలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది.
I apologise as a woman and human being for what was said.This can never be tolerated irrespective of whoever did it,of the space it was said or party they adhere to.And I’m able to openly apologise for this because my leader @mkstalin and my party @arivalayam don’t condone this. https://t.co/FyVo4KvU9A
— Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) October 27, 2022
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?