DK Aruna: ప్రభుత్వ భూములు అమ్మీ ఆ సొమ్ముతో ఎన్నికలకు వెళ్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎన్నికలకు అన్నిరకాలుగా సిద్దమవుతోంది అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా ముందుకు వెళ్తున్నామని ఆమె తెలిపారు. 9 ఏళ్లుగా రాష్ట్రానికి పట్టిన పీడను ప్రారదొలెందుకు ప్రజలు రెఢీగా ఉన్నారు అంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన దోపిడీ, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక వాతావరణం క్రియేట్ కోసమే ఎమ్మేల్యేలు పర్యటన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. వారం రోజుల పాటు తెలంగాణలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు అని డీకే అరుణ వెల్లడించారు.
Read Also: Allu Arjun: పిల్లనిచ్చిన మామ కోసం సాగర్లో సందడి చేసిన అల్లు అర్జున్
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ప్రజల ఆకాంక్షల మీద రిపోర్ట్ తయారు చేస్తారు అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. కేసీఆర్ కి ఎన్నికలు వస్తేనే పథకాలు గుర్తుకు వస్తాయి.. ప్రభుత్వ భూములు అమ్మీ.. ఆ సొమ్ముతో ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ చూస్తున్నాడుని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారు అని పేర్కొనింది.
Read Also: Viral Video: మెట్రోలో అమ్మాయి స్టంట్ అదుర్స్.. వీడియో వైరల్
బీజేపీ 18 రాష్ట్రాల్లో పాలిస్తుంది.. అక్కడ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని డీకే అరుణ అన్నారు. అన్ని పార్టీల్లో చివరి నిమిషంలో జంపింగులు కామన్.. జనాల్ని దోచుకోవడమే ట్రైలర్ గా బీఆర్ఎస్ పార్టీ చూపించింది అని తెలిపింది. అధికారం కోసం గడ్డి తినేందుకు కూడా కల్వకుంట్ల కుటుంబం వెనుకాడరు.. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారు మతం పేరుతో గెలవాలని చూస్తున్నారు అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు విమర్శించారు.
Read Also: Uttam Kumar Reddy: ఆ పార్టీతో మాకు పోటీ లేదు.. తెలంగాణలో 70 సీట్లను గెలుస్తాం..!
రాష్ట్రంలో అభివృద్ధి చేశామని నమ్మక్కం ఉంటే పోలీసులు లేకుండా ప్రజల్లోక్కి రావాలి అని డీకే అరుణ సవాల్ విసిరారు. మతం పేరుతో చిచ్చు పెడుతుంది.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు.. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడ బాంబ్ దాడులు, మత కలహాలు జరగలేదు.. మతం పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు వీడియోలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.. ఈ రెండు పార్టీలు కుర్చీ కోసం ఏదైనా చేస్తారు.. వారి కుట్రలను ప్రజలు గమనించాలి.. తెలంగాణలో అబివృద్ధి కావాలంటే బీజేపీ రావాల్సిన అవసరం ఉంది అని డీకే అరుణ అన్నారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!