ఇటీవల మొయినాబాద్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తాజాగా సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో దుర్మార్గంగా ప్రభుత్వాలను కూల్చే కుట్ర జరుగుతోందని, బీజేపీ అగ్రనేతలపై విమర్శలు గుప్పించారు. మొయినాబాద్ ఎమ్మెల్యేల కొనుగోలు నిందితులకు సంబంధించిన పలు వీడియోలను సైతం సీఎం కేసీఆర్ విడుదల చేశారు. అయితే.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. అసలు ముఖ్యమంత్రి చెప్తున్న ఆ ముగ్గురు నిందితులకు బీజేపీకి ఏమి సంబంధమని ఆమె ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయమని ముఖ్యమంత్రి కేసీఆర్కు స్పష్టం అయిందని, అందుకే మీడియా సమావేశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆమె మండిపడ్డారు.
Also Read : CM KCR : 8 ప్రభుత్వాలు కూలగొట్టాం. మరో 4 ప్రభుత్వాలు కూలగొడుతాం.. ప్రెస్మీట్లో సంచలన విషయాలు
వీడియో చేయడానికి చాలా కష్ట పడ్డాం అని ముఖ్యమంత్రే ఒప్పుకున్నాడని, దయ్యాలు వేదాలు వల్లించి నట్లు ఉందంటూ ఆమె విమర్శలు గుప్పించారు. నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేసి గెలిచారని, ముగ్గురు ఎమ్మెల్యే లను కొన్నది ఎవరు? అని ఆమె ప్రశ్నించారు. దేశ ప్రధాన మంత్రి గురించి మాట్లాడినంత మాత్రాన దేశ్ కి నేత కారని, కేసులు పై భయం లేనప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎందుకు అడ్డుకున్నావని ఆమె మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొడతారంటూ ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు.