DK Aruna : కవిత లేఖ వెనుక రాజకీయం.. డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
- తండ్రికి రాసిన లేఖ ఎలా బయటికి వచ్చింది..?
- ప్రధాని మోడీని కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు
- మీరు ఎన్ని కుట్రలు చేసినా.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
- తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడింది
- కాంగ్రెస్కు, ప్రస్తుత సీఎంకు కవితతో మంచి సంబంధాలున్నాయి. :డీకే అరుణ
DK Aruna : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్టాపిక్గా మారింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా పత్రికల్లో వచ్చిన లేఖ. ఈ లేఖపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. తండ్రికి కూతురు లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? నిజంగా కవిత ఈ లేఖ రాశారా? లేదా ఆమె పేరుతో వేరే ఎవరైనా విడుదల చేశారా? అనే అనుమానాలను ఆమె వ్యక్తం చేశారు. ఈ లేఖ విడుదల వెనుక రాజకీయ ఎత్తుగడ ఉందని డీకే అరుణ ఆరోపిస్తున్నారు. ఇది కేవలం కుటుంబ భావోద్వేగాల వ్యక్తీకరణ మాత్రమే కాదని, దీని వెనుక కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు. కవిత లేఖను కాంగ్రెస్ పార్టీనే విడుదల చేసిందా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టకపోవడం ద్వారా కాంగ్రెస్కు మద్దతు తెలపాలన్న ఆలోచనగా ఇది కనిపిస్తోందని ఆరోపించారు.
US: త్వరలోనే పెళ్లి.. ఇంతలో దుండగుడి కాల్పుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి
Also Read
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
- Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
- Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
కవిత లేఖ ద్వారా బీజేపీని టార్గెట్ చేస్తే ప్రజల మద్దతు వస్తుందని కొన్ని పార్టీలు భావిస్తున్నాయని డీకే అరుణ అన్నారు. కానీ ప్రజల్లో బీజేపీపై పెరుగుతున్న విశ్వాసాన్ని ఎవరూ తగ్గించలేరని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ గెలుస్తుంది అనే భావన ప్రజల్లో పెరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ విఫలమైన పార్టీలు. ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా బీజేపీనే చూస్తున్నారు అని ఆమె చెప్పారు. బీఆర్ఎస్తో బీజేపీ కలవడమనే అవకాశమే లేదు. గతంలో మీరు చేసిన కుట్రలు ప్రజలు మర్చిపోలేదు. అయినా బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఆపలేరు అంటూ డీకే అరుణ కుండబద్దలుగొట్టిన వ్యాఖ్యలు చేశారు.
కవితకు కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఉన్న సంబంధాలు అందరికీ తెలిసిందే అని, ముఖ్యంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో ఆమె సన్నిహితత్వం ఉందని, వారు కలిసి వ్యాపారం కూడా చేశారని ఆరోపణలు ఉన్నాయని ఆమె తెలిపారు. తండ్రికి రాసిన లేఖ ఎలా బయటకు వచ్చింది? ఈ లేఖ ద్వారా బీజేపీని విమర్శిస్తూ ప్రజలను మోసపెట్టాలని చూస్తున్నారు. కానీ బీజేపీ ప్రజల్లో నమ్మకాన్ని సంపాదించుకుంది. ఈ కుట్రలు ఎప్పటికీ ఫలించవు అని డీకే అరుణ స్పష్టం చేశారు.
Delhi: అకస్మాత్తుగా ఢిల్లీ వర్సిటీలోకి రాహుల్గాందీ.. ప్రొటోకాల్ ఉల్లంఘించారంటూ అభ్యంతరం
తాజావార్తలు
-
Mark Zuckerberg: ఫేస్బుక్ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్బర్గ్కు డిగ్రీ లేదు తెలుసా!
-
TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
-
Cigarette Price Hike: సిగరెట్ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
-
Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?