Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Dk Aruna Comments On Floods In Telangana

DK Aruna : ప్రజల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి… మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం చేతులెత్తేశారు

Published Date :July 28, 2023 , 7:58 pm
By Gogikar Sai Krishna
DK Aruna : ప్రజల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి… మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం చేతులెత్తేశారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

వారం పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయని, చాలామంది కొట్టుకుపోయారని, రోడ్లు కొట్టుకుపోయాయని, హైవేలు, వంతెనల పైనుంచి నీరు ప్రవహిస్తోందన్నారు బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ. శుక్రవారం నాడు హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో మాజీ మంత్రి డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. భూపాలపల్లి, ములుగు, వరంగల్, జనగామ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని, ప్రజల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. 5 లక్షల ఎకరాల పంట నీట మునిగిందని, దాదాపు 40 వేల కుటుంబాలు కట్టు బట్టలతో ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు డీకే అరుణ. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం సమీక్ష కూడా నిర్వహించకపోవడం దారుణమని, భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు డీకే అరుణ. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం చేతులెత్తేశారని, గత రెండేళ్లుగా వర్షాలకు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలు ఎదుర్కొన్నారని.. అయినా సర్కార్ గుణపాఠం నేర్చుకోలేదన్నారు.

Also Read : Online Love Story: ప్రియుడిని పెళ్లాడేందుకు చైనా నుంచి పాకిస్థాన్‌కు.. సరిహద్దు దాటిన మరో ప్రియురాలు

వరంగల్ లో నీళ్లు ఉన్నాయా? నీళ్లలో వరంగల్ ఉందా..? అనే అనుమానం కలుగుతోందని, వరంగల్ లోనే దాదాపు 150 కాలనీలు నీట మునిగాయన్నారు డీకే అరుణ. గతంలో నీట మునిగిన ఇండ్లకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి కూడా కేవలం ఎలక్షన్ ఉందనే కారణంగా రూ.10 వేలు ఇచ్చారని ఆమె అన్నారు. మరి ఇప్పుడు అంతకంటే భారీ వర్షంతో ఇండ్లు నీట మునిగాయని, ఇప్పుడు ఎందుకు కేసీఆర్.. రూ.10 వేలు ఇవ్వడం లేదని ఆమె వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా సమీక్ష నిర్వహించి ఎంత పంట నష్టపోయింది, ఎన్ని ఇండ్లు మునిగాయి, ఎందరు చనిపోయారు, ఎందరు గల్లంతయ్యారు అనే వివరాలు తెలిసుకుని సహాయం చేయాలన్నారు. డల్లాస్ చేస్తానని చెప్పి హైదరాబాద్ ను ఖల్లాస్ చేశారని ఆమె విమర్శించారు. హైదరాబాద్ లో పెద్ద భవంతుల నిర్మాణం జరిగిందంటే అందులో కేసీఆర్ కుటుంబానికి భాగస్వామ్యం ఉన్నట్లేనని, వందల ఫ్లోర్లకు అనుమతి ఇచ్చి భాగస్వామ్యం తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉన్నాయని, చాలా నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టలేదన్నారు.

వర్షాలకు ఉన్న రోడ్లు కూడా ధ్వంసమయ్యాయని, హైవే రోడ్ల మీదనే గుంతలతో ప్రయాణం చేయలేని పరిస్థితి ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జంపన్న వాగులో 8 మంది మృతదేహాలు లభ్యమైన పరిస్థితి కలిచివేసిందని, వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే బావ బామ్మర్దులు ఇద్దరూ ఎన్నికల కసరత్తులో బిజీగా ఉన్నారని ఆమె విమర్శలు గుప్పించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించాలని, కేసీఆర్ వద్ద ఉన్న బస్సు దేనికి.. ప్రజల కోసం తీరిగేందుకు కాదా? కేవలం ఎన్నికల సమయంలో తిరిగేందుకేనా? ప్రజల కోసం కాకుంటే హెలికాప్టర్, బస్సులు కొనడం దేనికి? అని ఆమె ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని, సర్వం కోల్పోయిన వారికి రూ.25 లక్షలు ఇవ్వాలని, కేబినెట్ పెట్టేది కూడా వర్షాల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు కాదు.. ఎన్నికల్లో ప్రజలను మరోసారి ఎలా మోసం చేయాలనే నిర్వహిస్తున్నారన్నారు. నీట మునిగిన ప్రాంతాల పరిశీలనలో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద బూర నర్సయ్య గౌడ్ ను బీఆరెస్ నేతలు అడ్డుకున్నారన్నారు. బీఆరెస్ నేతలు సహాయం చేయరు.. చేసే వారిని కూడా చేయనివ్వరన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • DK Aruna
  • latest news
  • Telangana Floods
  • telugu news

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions