Online Love Story: ప్రియుడిని పెళ్లాడేందుకు చైనా నుంచి పాకిస్థాన్కు.. సరిహద్దు దాటిన మరో ప్రియురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Love Story: ఇటీవల ప్రేమకోసం ప్రేమికులు దేశ సరిహద్దులను దాటి.. తమ ప్రేమను గెలిపించుకోవడానికి రిస్క్ చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతను అధిగమించి దేశ సరిహద్దులను కూడా దాటిపోతున్నారు. ఇటీవల ఫేస్బుక్లో పరిచయమైన ప్రేమికుడి కోసం రాజస్థాన్కు చెందిన 34 ఏళ్ల వివాహిత అంజు పాకిస్థాన్కు వెళ్లిన విషయం తెలిసిందే. పాకిస్థాన్కు వెళ్లి ఇస్లాంలో చేరి ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకుంది. అప్పటికి పెళ్లి అయిన అంజుకు భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరో ఘటనలో 30 ఏళ్ల సీమా హైదర్ అనే పాకిస్థాన్ మహిళ పబ్జీలో పరిచయమైన ప్రియుడి కోసం భారత్కు వచ్చింది. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలున్న సీమా.. వారిని తీసుకుని 22 ఏళ్ల సచిన్ కోసం భారత్లో అడుగుపెట్టింది. ఈ విచిత్ర ప్రేమ కథలను మరిచిపోకముందే అలాంటి ఘటనే మరొకటి జరిగింది. చైనాకు చెందిన ఓ యువతి స్నాప్చాట్లో పరిచయమైన ప్రేమికుడి కోసం పాకిస్థాన్కు వెళ్లింది. 3 నెలల వీసా తీసుకుని మరి సదరు యువతి పాక్లో అడుగుపెట్టింది.
Also Read: Udupi College Case: ఉడిపి కాలేజీ కేసులో సిద్ధరామయ్యపై ట్వీట్.. బీజేపీ కార్యకర్తపై కేసు
Also Read
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
- Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
- Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
ఒక చైనా మహిళ తాను స్నాప్చాట్లో స్నేహం చేసి ప్రేమలో పడిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్కు వెళ్లినట్లు పోలీసులు గురువారం తెలిపారు. గావో ఫెంగ్ అనే మహిళ మూడు నెలల వీసా సందర్శనపై చైనా నుంచి గిల్గిట్ మీదుగా రోడ్డు మార్గంలో గత వారం ఇస్లామాబాద్ చేరుకుంది. 21 ఏళ్ల ఆమెను ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని బజౌర్ గిరిజన జిల్లా నివాసి అయిన 18 ఏళ్ల స్నేహితుడు జావేద్ తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న బజౌర్ జిల్లాలో భద్రతా పరిస్థితుల కారణంగా జావేద్ తన స్వగ్రామానికి బదులుగా లోయర్ దిర్ జిల్లాలోని సమర్బాగ్ తహసీల్లోని తన మామ ఇంటికి మహిళను తీసుకెళ్లాడు.
Also Read: Elgar Parishad Case: ఎల్గార్ పరిషత్ కేసు.. ఇద్దరికి సుప్రీం బెయిల్ మంజూరు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరూ గత మూడేళ్లుగా స్నాప్చాట్ ద్వారా పరిచయం ఉన్నారని, ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. గావో ఇస్లాంలోకి మారిన తర్వాత జావేద్ను బుధవారం వివాహం చేసుకున్నాడు. ఆమె కొత్త పేరు కిస్వా అని ఆ వ్యక్తి తల్లి బంధువు ఇజ్జతుల్లా ఖాన్ తెలిపారు. గావో జులై 20న ఇస్లామాబాద్కు వచ్చారని, అక్కడ జావేద్ ఆమెను స్వీకరించారని ఇజ్జతుల్లా చెప్పారు. అక్కడి నుంచి జులై 21న లోయర్ దిర్ జిల్లాకు వచ్చారు, సమర్బాగ్లోని ఇజ్జతుల్లా నివాసంలో గావో బస చేశారు. భద్రతా కారణాలు, పవిత్ర రంజాన్ మాసం కారణంగా ఆమెను జిల్లాలో ఉండడం సురక్షితం కాదని స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం వారిని ఒప్పించడంతో జావేద్, గావోలు పెళ్లి చేసుకుని ఇస్లామాబాద్కు వెళ్లిపోయారని ఇజ్జతుల్లా చెప్పారు. జావేద్ బజౌర్ డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ కోర్సును అభ్యసిస్తున్నాడని ఇజ్జతుల్లా తెలిపారు. ఈ వివరాలను పోలీసులు కూడా ధృవీకరించారు. కొద్ది రోజుల్లో గావో చైనాకు తిరిగి వెళ్లనుండగా, జావేద్ పాకిస్థాన్లోనే ఉంటాడని ఇజ్జతుల్లా చెప్పారు. పాకిస్థాన్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత జావేద్ చైనాకు వెళ్లనున్నాడని, దానికి దాదాపు ఏడాది సమయం పడుతుందని ఆయన తెలిపారు.
Also Read: Girls Videos Row: కాలేజీ వాష్రూంలో నగ్న దృశ్యాల చిత్రీకరణ.. స్పందించిన జాతీయ మహిళా కమిషన్
లోయర్ దిర్ జిల్లా పోలీసు అధికారి జియావుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. చైనా మహిళకు సమర్బాగ్ ప్రాంతంలో పూర్తి భద్రత కల్పించామని తెలిపారు. మొహర్రం, భద్రతాపరమైన సమస్యల కారణంగా ఆమెకు స్వేచ్ఛగా తిరిగే అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. అయితే గావో ఫెంగ్ ప్రయాణ పత్రాలన్నీ సక్రమంగా ఉన్నాయని తెలిపారు. మూడేళ్లుగా ఇద్దరికీ పరిచయం ఉందని, అయితే వారిద్దరూ ఇంకా నిఖా చేసుకోలేదని పోలీస్ అధికారి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!