DK Aruna : నారీశక్తి ఏంటో నిరూపించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు అంతా నారీశక్తిని నిరూపించాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళా మోర్చా కార్యవర్గ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా మహిళా మోర్చ కార్యాచరణను వివరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించు కొని తెలంగాణ వ్యాప్తంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఆయా రంగాలలో… వారు చేస్తున్న సేవలను ఈ సందర్బంగా కొనియాడారు డీకే అరుణ. బీజేపీ గెలుపులో నారీ శక్తిని నిరూపించాలన్నారు డీకే అరుణ. మహిళలు ఆర్థిక స్వాతంత్రం సాధించే దిశలో దేశంలో మోడీ పాలన సాగుతోందని, 33% రిజర్వేషన్ తో భవిష్యత్ లో మహిళలకు రాజకీయాల్లో సమూచిత స్థానం రాబోతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకునే మహిళలు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.
అంతేకాకుండా..’ తెలంగాణ లో 12 సీట్లు గెలవబోతున్నాం. మహిళలను మునుపెన్నడూ లేని విధంగా కేంద్రం లోని మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మహిళలు ఆర్థిక స్వాతంత్రం సాధించినపుడే దేశం పురోభివృద్ధి సాధ్యం అవుతుందన్న మోదీ నమ్ముతున్నారు. అందుకే కేంద్రంలోని మోదీ కేబినెట్ లో 11 మంది మహిళలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో మగవాళ్ల కంటే ఎక్కువగా మహిళలు కుటుంబ పోషణలో కష్టపడుతున్నారు. ప్రతి ఒక్క ఆడబిడ్డ చదువుకోవాలి అని మోదీ ప్రభుత్వం భేటీ పడవో భేటీ బచావో కార్యక్రమం తీసుకొచ్చింది. ముద్ర లోన్స్ ఇచ్చి డ్వాక్రా మహిళలను ప్రోత్సహిస్తున్నది బీజేపీ ప్రభుత్వమే. గ్రామీణ ప్రాంత మహిళల గురించి అలోచించి కట్టెల పొయ్యి కష్టాలను తీర్చి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది మోదీ ప్రభుత్వమే. దేశ అత్యునత పదవిలో రాష్ట్రపతిగా గిరిజన వర్గానికి చెందిన ద్రౌపతి మూర్ముకు అవకాశం ఇచ్చారు అంటే.. అదీ మోదీ మహిళలకు ఇస్తున్న గౌరవం. ఇచ్చిన మాట ప్రకారం 500 ఏళ్లుగా హిందువులు ఎదురు చూస్తున్న అయోధ్య లో భవ్య రామ మందిరం నిర్మించిన ఘనత మోడీ. రామరాజ్య స్థాపనలో ముందడుగు వేసిన మోదికి మహిళలు అంతా అండగా నిలవాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా మోర్చా నేతలు అంకిత భావంతో పనిచేసి పార్టీ గెలుపులో భాగస్వామ్యం కావాలి.’ అని డీకే అరుణ అన్నారు.
Also Read
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
- FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
తాజావార్తలు
-
Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
-
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
-
JanaNayagan : జననాయగన్ మరోసారి సెన్సార్.. అదనంగా మరో 41 సెకండ్స్
-
FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
-
AK 64 : శ్రీలీల ఆఫర్ కయాద్ లోహార్ తన్నుకు పోయిందా..?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!