DK Aruna : నారీశక్తి ఏంటో నిరూపించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు అంతా నారీశక్తిని నిరూపించాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళా మోర్చా కార్యవర్గ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా మహిళా మోర్చ కార్యాచరణను వివరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించు కొని తెలంగాణ వ్యాప్తంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఆయా రంగాలలో… వారు చేస్తున్న సేవలను ఈ సందర్బంగా కొనియాడారు డీకే అరుణ. బీజేపీ గెలుపులో నారీ శక్తిని నిరూపించాలన్నారు డీకే అరుణ. మహిళలు ఆర్థిక స్వాతంత్రం సాధించే దిశలో దేశంలో మోడీ పాలన సాగుతోందని, 33% రిజర్వేషన్ తో భవిష్యత్ లో మహిళలకు రాజకీయాల్లో సమూచిత స్థానం రాబోతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకునే మహిళలు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.
అంతేకాకుండా..’ తెలంగాణ లో 12 సీట్లు గెలవబోతున్నాం. మహిళలను మునుపెన్నడూ లేని విధంగా కేంద్రం లోని మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మహిళలు ఆర్థిక స్వాతంత్రం సాధించినపుడే దేశం పురోభివృద్ధి సాధ్యం అవుతుందన్న మోదీ నమ్ముతున్నారు. అందుకే కేంద్రంలోని మోదీ కేబినెట్ లో 11 మంది మహిళలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో మగవాళ్ల కంటే ఎక్కువగా మహిళలు కుటుంబ పోషణలో కష్టపడుతున్నారు. ప్రతి ఒక్క ఆడబిడ్డ చదువుకోవాలి అని మోదీ ప్రభుత్వం భేటీ పడవో భేటీ బచావో కార్యక్రమం తీసుకొచ్చింది. ముద్ర లోన్స్ ఇచ్చి డ్వాక్రా మహిళలను ప్రోత్సహిస్తున్నది బీజేపీ ప్రభుత్వమే. గ్రామీణ ప్రాంత మహిళల గురించి అలోచించి కట్టెల పొయ్యి కష్టాలను తీర్చి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది మోదీ ప్రభుత్వమే. దేశ అత్యునత పదవిలో రాష్ట్రపతిగా గిరిజన వర్గానికి చెందిన ద్రౌపతి మూర్ముకు అవకాశం ఇచ్చారు అంటే.. అదీ మోదీ మహిళలకు ఇస్తున్న గౌరవం. ఇచ్చిన మాట ప్రకారం 500 ఏళ్లుగా హిందువులు ఎదురు చూస్తున్న అయోధ్య లో భవ్య రామ మందిరం నిర్మించిన ఘనత మోడీ. రామరాజ్య స్థాపనలో ముందడుగు వేసిన మోదికి మహిళలు అంతా అండగా నిలవాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా మోర్చా నేతలు అంకిత భావంతో పనిచేసి పార్టీ గెలుపులో భాగస్వామ్యం కావాలి.’ అని డీకే అరుణ అన్నారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
తాజావార్తలు
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..