Kadiyam Srihari: విభజన చట్టంలో హామీలను ఎందుకు అమలు చేయడం లేదు..
జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ గానీ కాంగ్రెస్ పార్టీ గాని తెలంగాణకు వరగబెట్టింది ఏమీ లేదు అంటూ విమర్శించారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయలేదు అని ఆగ్రహం వ్యక్తం చేందారు.
Also Read : Maruti Suzuki : మేలో 1.78 లక్షల యూనిట్ల మారుతి వాహనాల అమ్మకం.. అత్యధికంగా అమ్ముడైనవి ఇవే
Also Read
- IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేయడం లేదు అంటూ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే అధికారం మరిచిపోయి.. ప్రజల సంక్షేమం మర్చిపోయి దోచుకోవడమే పనిగా వాళ్లు రాజకీయం చేస్తారు అని ఆయన విమర్శలు గుప్పించారు. అనేక రకాలైన అవినీతి కుంభకోణాలలో కూరుకుపోయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.. కుక్కలు చింపిన ఇస్తరి వలె ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉందంటూ ఎద్దేవా చేశారు.
Also Read : Toll Plaza Rules Change: హైవేపై ప్రయాణీకులకు శుభవార్త! నేటి నుంచి టోల్ ట్యాక్స్ నిబంధనలలో భారీ మార్పు!
కాంగ్రెస్ నాయకుల నాయకత్వంలో పస లేదు.. ప్రజా సమస్యల పైన పోరాటం చేసే తపన వారిలో కనపడం లేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా ప్రజలకు ఉపయోగపడే పార్టీలు కాదు.. భారత రాష్ట్ర సమితి మాత్రమే మన ఇంటి పార్టీ.. తెలంగాణ అభివృద్ధిని.. తెలంగాణ హక్కులను కాపాడే పార్టీ అంటూ తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలనేదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
తాజావార్తలు
-
IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
-
Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
-
Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్?
-
The India Story: జూలై 24న కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరి’
-
AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!