Free Tabs: 10 రోజుల పాటు ట్యాబ్ల పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Tabs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది రోజుల పాటు విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేయనుంది.. రేపు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు రూ. 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లు ఉచితంగా పంపిణీ చేస్తారు.. రేపు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి లో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్.. దాదాపు రూ.17,500కు పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్ దాదాపు రూ.15,500 విలువ గల బైజూస్ కంటెంట్ తో కలిపి ప్రతి 8వ తరగతి విద్యార్థికి రూ. 33,000 లబ్ధి చేకూరనుంది.
ప్రస్తుతం అందిస్తున్న 4,34,185 ట్యాబులతో కలిపి ఇప్పటివరకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, బోధిస్తున్న ఉపాధ్యాయులకు రూ.1.305.74 కోట్లవ్యయంతో 9,52,925 ట్యాబులు అందజేయనున్నారు. 8వ తరగతి విద్యార్థులు పై తరగతులకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగపడేలా 8వ తరగతితో పాటు 9, 10 తరగతుల బైజూస్ కంటెంట్ లోడ్ చేసి ట్యాబ్ లు అందచేస్తున్న విషయం విదితమే. ఇప్పుడు అందించే ట్యాబ్ లలో 11, 12 తరగతుల కంటెంట్ కూడా లోడ్ చేసేలా ట్యాబ్ మెమరీ కార్డ్ సామర్థ్యం 256 జీబీకి పెంచి మరీ అందిస్తోంది జగన్ సర్కార్.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఉచిత ట్యాబ్లలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, టోఫెల్ ప్రిపరేషన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా అన్ని ట్యాబ్ ల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బాట్ (డౌట్ క్లియరెన్స్ బాట్) అప్లికేషన్.. మన పిల్లలు సులభంగా విదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేందుకు వీలుగా డ్యులింగో (DUOLINGO) ఇన్ స్టాల్ చేయబడింది.. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా పని చేసేలా ఏర్పాటు చేశారు. 4 నుండి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ఉచితంగా అందిస్తున్న రూ.15,500 విలువైన బైజూస్ కంటెంట్ ఇక 11, 12వ తరగతులకు కూడా.. తద్వారా 34.3 లక్షల మంది విద్యార్థులకు కంటెంట్ రూపేణా లబ్ధి చేకూరుతుంది.
ఉచిత ట్యాబ్లలో మెమరీ కెపాసిటీ పెంచడంతో పాటు ట్యాబ్ సంరక్షణ కోసం రగ్డ్ కేస్. టెంపర్డ్ గ్లాస్ వంటి అదనపు హంగులు ఉన్నాయి. ట్యాబ్ లలో అవాంఛనీయ సైట్లు, యాప్స్ ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్ వేర్.. 3 ఏళ్ల పాటు సంపూర్ణ వారంటీ.. ఏదైనా సమస్య తలెత్తితే సమీపంలోని సచివాలయాల్లో లేదా మీ హెడ్మాస్టర్ కు ఇవ్వండి.. ఒక వారంలో రిపేర్ చేసైనా ఇస్తారు లేదా మార్చి వేరేదైనా ఇస్తారు.. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ.. మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్.. 45 వేల స్మార్ట్ టీవీలు అందజేసింది సర్కార్.
ఇక, డిజిటల్ విధానంలో బోధనకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి, ఆపైన ప్రతి తరగతి గదిలో ఆన్లైన్తో పాటు ఆఫ్ లైన్లో కూడా పని చేసేలా బైజూస్ కంటెంట్, ఏపీ ఎస్ఈఆర్ టి తయారు చేసిన ఈ-కంటెంట్ తో కూడిన 62వేల ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్- 1-5 తరగతులకు ప్రతి స్కూల్లో ఒకటి చొప్పున దాదాపు 45 వేల స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులకు డిజిటల్ మౌలిక వసతులు మరింత మెరుగుపరుస్తూ రాష్ట్రవాప్తంగా దాదాపు 45వేల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఫైబర్/ బ్రాడ్ బాండ్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది జగన్ ప్రభుత్వం. పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు, వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన,.. సీబీఎస్ఈ మొదలు ఐబీదాకా అడుగులు వేస్తున్నారు.
ఇంటర్నేషనల్ బాకలారియేట్ (IB) గ్లోబల్ బోర్డ్ సర్టిఫికేషన్తో అనుసంధానం ద్వారా మన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ కాలేజీల్లో సీట్లు అయినా, ఉపాధి అయినా సులభంగా దక్కించుకునే అవకాశం ఉంది. విద్యార్థులను గ్లోబల్ సిటీజన్లుగా తీర్దిదిద్దేలా ఫ్యూచరిస్టిక్ స్కిల్స్లో భాగంగా ఐవోటీ, ఏఐ, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ లిటరసీ, మెటావర్స్, డేటా ఎనలెటిక్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఎల్ఎల్ఎం, వీఆర్, ఏఆర్ వంటి పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తుంది జగనన్న ప్రభుత్వం.. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ లో నైపుణ్యం సాధించేలా ఈ ఏడాది ఇప్పటికే టోఫెల్న్ ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టిన జగనన్న ప్రభుత్వం.. 3వ తరగతి నుంచే తర్ఫీదు ఇస్తూ ప్రతి స్కూల్లో టోఫెల్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ అందజేత.. ఈ మేరకు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇచ్చేలా అమెరికన్ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్) తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!