Double Bedroom Houses: గ్రేటర్ ప్రజలకు శుభవార్త.. రేపటి నుంచే ఇళ్ల పంపిణీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double Bedroom Houses: హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం గ్రేటర్ పరిధిలో లక్ష పడక గదుల ఇళ్ల పంపిణీ ప్రక్రియను రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే.. ఈ ప్రక్రియను ఐదు నుంచి ఆరు దశల్లో.. గ్రేటర్ హైదరాబాద్లో ఎంపికైన లబ్ధిదారులకు మొదటి విడతగా సెప్టెంబర్ 2న డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడుతలో 11 వేల 700 ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. విడతల వారీగా పంపిణీ చేసి అక్టోబర్ వరకు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 70 వేల ఇళ్లు పూర్తి చేసి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
Read also: Sri Lakshmi Stotram: సిరి సంపదలతో మీ ఇల్లు నిలయమవ్వాలంటే ఈ స్తోత్రాలు వినండి
Also Read
- KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
మొదటి విడుతలో కుత్బుల్లాపూర్లో మంత్రి కేటీఆర్, శేరిలింగంపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కొల్లూరులో హరీశ్ రావు, మేడ్చల్లో మల్లారెడ్డి, ఉప్పల్లో మేయర్ విజయలక్ష్మి, ప్రతాపసింగారంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మహాశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ పాతబస్తీలో, రాజేంద్రనగర్లోని పట్నం మహేందర్ రెడ్డి డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఆగస్టు 15న ప్రకటించిన సీఎం కేసీఆర్.. మరుసటి రోజే సంబంధిత అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. పంపిణీకి సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. మురికివాడల్లో నివసించే పేదల గుడిసెలు తొలగించి వాటి స్థానంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించామని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో 4,500 మంది పేదలకు ఇళ్లు మంజూరు చేశామన్నారు. మరో 70 వేల ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇంటింటి సర్వే నిర్వహించి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తున్నామని మంత్రి తెలిపారు. అనంతరం వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించి వారి పేర్లతో లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు.
Gold Price Today : మహిళలకు బ్యాడ్ న్యూస్.. రెండో రోజు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?
తాజావార్తలు
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!