Deputy CM Pawan Kalyan: హైదరాబాద్ నుంచి ఏపీకి డిప్యూటీ సీఎం.. పవన్ వెంట త్రివిక్రమ్, ఆనంద్ సాయి..
- అమరావతి చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కి పవన్..
- పవన్ వెంట సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రానికి చేరుకున్నారు.. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు పవన్ కల్యాణ్.. అయితే, ఆయనతో పాటు సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి మరియు కమెడియన్లు నర్ర శ్రీనివాస్.. నాగ శ్రీనివాస్ కూడా ఉన్నారు.. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు పవన్ కల్యాణ్..
Read Also: Ponnam Prabhakar: ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా.. బీజేపీ, బీఆర్ఎస్ లపై పొన్నం ఫైర్
Also Read
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
- AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
కాగా, అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ముంబై వెళ్లిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు.. అక్కడి నుంచి ఈ రోజు గన్నవరం వచ్చారు.. అయితే, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో పవన్ కల్యాణ్కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత.. ఆయనతో త్రివిక్రమ్ కనిపించడం ఇదే మొదటిసారి అంటున్నారు.. మరోవైపు పవన్ వెంట ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఎందుకు? వచ్చారు అనేదానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది.. ఆనంద్ సాయితో ఏదై కొత్త డిజైన్లు గీయిస్తారా? పిఠాపురంలో భూమి కొనుగోలు చేసినట్టు ప్రకటించిన పవన్.. అక్కడ నిర్మాణాల కోసం ఏమైనా ప్లాన్ గీయిస్తున్నారా? ఇంకేదైనా కారణం ఉందా? అనే చర్చ సాగుతోంది.. మరోవైపు.. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు.. అమరావతిలో నిర్మాణలపై కూడా ప్రభుత్వం దృష్టిసారించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!