MS Dhoni: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ధోనీ టికెట్ కలెక్టర్ అపాయింట్మెంట్ లెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఎంఎస్ ధోని ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. ధోనీని అందరూ కెప్టెన్ కూల్ అని పిలిచేవారు. ధోనీ కెప్టెన్సీలో మూడు ఫార్మాట్లలో (టీ20 ప్రపంచకప్ 2007, ప్రపంచకప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013) భారత్ను ఛాంపియన్గా మార్చాడు. అంతేకాకుండా ధోనీ సారథ్యంలో భారత జట్టు టెస్టు క్రికెట్లో నంబర్వన్ ర్యాంక్ను సాధించింది.
ధోనీ 2020 సంవత్సరంలో రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు ధోని ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే.. ధోనీ విజయవంతమైన క్రికెటర్గా మారడానికి ముందు అతను ఏం చేసేవాడో తెలుసా.. తాను క్రికెటర్ కాకముందు రైల్వేస్ లో జాబ్ వచ్చింది. ఖరగ్ పూర్ లో టిక్కెట్ కలెక్టర్ గా పనిచేసేవాడు. అయితే తన ప్రపంచం అది కాదు.. క్రికెటర్ కావాలన్నది ధోని కల. అతని కలను నెరవేర్చుకోవడానికి రైల్వే ఉద్యోగం వదిలి బ్యాట్ పట్టాడు. ఇప్పుడు ప్రపంచంలోనే ధోనీ అంటే మంచిపేరు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే.. భారత గ్రేట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తొలి ఉద్యోగ నియామక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్ అభిమానులు కూడా దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Also Read
- IND Vs AFG: రోహిత్ 'చారిత్రాత్మక' రికార్డు.. గిల్ 'మెరుపు' ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
- Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
- Chiranjeevi : చరణ్ కష్టం చూసి 'ఇంత అవసరమా' అనుకున్నా
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
The first appointment letter of MS Dhoni. (JioCinema). pic.twitter.com/nrr53fDbhB
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2024
Threat Calls: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడికి బెదిరింపు కాల్స్
రాంచీలో జన్మించిన ధోని.. డిసెంబర్ 2004లో బంగ్లాదేశ్పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు గోల్డెన్ డక్తో ఔట్ అయ్యాడు. అయినప్పటికీ, ధోని పట్టు వదలలేదు. విశాఖపట్నంలో పాకిస్తాన్తో జరిగిన తన ఐదవ వన్డేలో 148 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన మొదటి అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. అప్పటినుంచి వెనుదిరిగి చూడలేదు. ఆ వెంటనే ధోనీ టీమిండియా కెప్టెన్గా మారాడు. ధోనీ సారథ్యంలో 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ను టీమిండియా కైవసం చేసుకుంది.
ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ, ఇప్పటికీ లీగ్ క్రికెట్లో చురుకుగా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ 2024లో ధోని మరోసారి CSKకి కమాండ్గా కనిపించనున్నాడు. గతేడాది ధోనీ సారథ్యంలో సీఎస్కే ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!