MS Dhoni: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ధోనీ టికెట్ కలెక్టర్ అపాయింట్మెంట్ లెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఎంఎస్ ధోని ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. ధోనీని అందరూ కెప్టెన్ కూల్ అని పిలిచేవారు. ధోనీ కెప్టెన్సీలో మూడు ఫార్మాట్లలో (టీ20 ప్రపంచకప్ 2007, ప్రపంచకప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013) భారత్ను ఛాంపియన్గా మార్చాడు. అంతేకాకుండా ధోనీ సారథ్యంలో భారత జట్టు టెస్టు క్రికెట్లో నంబర్వన్ ర్యాంక్ను సాధించింది.
ధోనీ 2020 సంవత్సరంలో రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు ధోని ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే.. ధోనీ విజయవంతమైన క్రికెటర్గా మారడానికి ముందు అతను ఏం చేసేవాడో తెలుసా.. తాను క్రికెటర్ కాకముందు రైల్వేస్ లో జాబ్ వచ్చింది. ఖరగ్ పూర్ లో టిక్కెట్ కలెక్టర్ గా పనిచేసేవాడు. అయితే తన ప్రపంచం అది కాదు.. క్రికెటర్ కావాలన్నది ధోని కల. అతని కలను నెరవేర్చుకోవడానికి రైల్వే ఉద్యోగం వదిలి బ్యాట్ పట్టాడు. ఇప్పుడు ప్రపంచంలోనే ధోనీ అంటే మంచిపేరు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే.. భారత గ్రేట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తొలి ఉద్యోగ నియామక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్ అభిమానులు కూడా దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
The first appointment letter of MS Dhoni. (JioCinema). pic.twitter.com/nrr53fDbhB
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2024
Threat Calls: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడికి బెదిరింపు కాల్స్
రాంచీలో జన్మించిన ధోని.. డిసెంబర్ 2004లో బంగ్లాదేశ్పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు గోల్డెన్ డక్తో ఔట్ అయ్యాడు. అయినప్పటికీ, ధోని పట్టు వదలలేదు. విశాఖపట్నంలో పాకిస్తాన్తో జరిగిన తన ఐదవ వన్డేలో 148 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన మొదటి అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. అప్పటినుంచి వెనుదిరిగి చూడలేదు. ఆ వెంటనే ధోనీ టీమిండియా కెప్టెన్గా మారాడు. ధోనీ సారథ్యంలో 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ను టీమిండియా కైవసం చేసుకుంది.
ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ, ఇప్పటికీ లీగ్ క్రికెట్లో చురుకుగా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ 2024లో ధోని మరోసారి CSKకి కమాండ్గా కనిపించనున్నాడు. గతేడాది ధోనీ సారథ్యంలో సీఎస్కే ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!