టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఎంఎస్ ధోని ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. ధోనీని అందరూ కెప్టెన్ కూల్ అని పిలిచేవారు. ధోనీ కెప్టెన్సీలో మూడు ఫార్మాట్లలో (టీ20 ప్రపంచకప్ 2007, ప్రపంచకప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013) భారత్ను ఛాంపియన్గా మార్చాడు. అంతేకాకుండా ధోనీ సారథ్యంలో భారత జట్టు టెస్టు క్రికెట్లో నంబర్వన్ ర్యాంక్ను సాధించింది.