Gollalamamidada: సూక్ష్మ కళాకారుడి భక్తి .. 1,01,001 బియ్యపు గింజలపై ‘రామ’ నామం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gollalamamidada: ఆంధ్ర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన గొల్లలమామిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దివ్య కళ్యాణ మహోత్సవములకు 16వ పర్యాయం రామనామ లిఖిత తలంబ్రాలను కళ్యాణ కొబ్బరిబొండాలను సిద్ధం చేశారు. లక్ష వెయ్యి ఒకటి (101001) బియ్యపు గింజలపై రామ నామాన్ని ఎటువంటి సూక్ష్మ పరికరము లేకుండా మార్కరు పెన్ను సహాయముతో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో లిఖించి సిద్ధం చేశారు. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లలమామిడాడ గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వ్యాయామ దర్శకులు లయన్ ద్వారంపూడి యువ రాజారెడ్డి వీటిని తయారు చేశారు.
Rayavaram Bus Tragedy: రాయవరం బస్సు ప్రమాద మృతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేబినెట్..
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ప్రతి సంవత్సరం పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున రామనామ లిఖిత యజ్ఞాన్ని ముక్కోటి ఏకాదశి పర్వదినము రోజు నుండి ప్రారంభించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం అనంతరం బియ్యపు గింజలపై రామ అనే మంత్రాన్ని రాయడం జరుగుతుందని యువ రాజారెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం 16వ సారి నిర్విఘ్నముగా ఈ మహా యజ్ఞం జరిగిందని అన్నారు. శ్రీరామనవమి రోజున రాముని కృపతో ఒక లక్ష వెయ్యి ఒక్కటి (101001) బియ్యపు గింజలపై రామా అనే నామాన్ని రాయడం జరిగిందని వివరించారు.

ఈ పవిత్రమైన రామనామ లికిత ఒక లక్ష వెయ్యి ఒక్కటి (101001) తలంబ్రాలను గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవం లో తలంబ్రాలుగా సమర్పించుట ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సదావకాశాన్ని రాముడు కల్పించినట్లు యువ రాజారెడ్డి తెలిపారు. అలాగే రాముని కళ్యాణంలో వినియోగించే కళ్యాణ కొబ్బరి బొండములను సంధ్య డెకరేషన్స్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సహకారంతో సర్వాంగ సుందరముగా శంకు చక్ర నామ సహితముగా సిద్ధం చేసి పెళ్ళికొడుకు రామయ్య, పెండ్లి కుమార్తె సీతమ్మ నామాలను లిఖించి కళ్యాణంలో ఆలయ ధర్మకర్త ద్వారంపూడి రామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి దంపతుల సమక్షంలో యువ రాజారెడ్డి సంధ్య దంపతుల కుటుంబ సభ్యులు ఆలయ అర్చకులకు అందజేయడం జరుగుతుంది.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!