Devineni Avinash: అందరి గుండెల్లో నెహ్రూ బ్రతికే ఉన్నారు.. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తాం!
- దేవినేని నెహ్రూవర్ధంతి సందర్భంగా అవినాష్ నివాళులు
- అందరి గుండెల్లో నెహ్రూ బ్రతికే ఉన్నారు
- నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీమంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద ఆయన తనయుడు, విజయవాడ వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ తలశీల రఘురాం, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్లు, పలువురు నేతలు దేవినేని నెహ్రూ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మట్లాడుతూ.. దేవినేని నెహ్రూ చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అయినా అందరి గుండెల్లో ఆయన బ్రతికే ఉన్నారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచిన వారు ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు.
‘దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు, నెహ్రూ అభిమానులతో కలిసి నివాళులు అర్పించాను. విజయవాడ నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు వర్ధంతి సందర్భంగా సేవ కార్యక్రమాలు చేసి ఘన నివాళులు అర్పిస్తున్నారు. చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అయినా.. అందరి గుండెల్లో నెహ్రూ బ్రతికే ఉన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ప్రజలకు సేవ చేశారు. ఆయన అడుగుజాడల్లో నడిచిన వారు ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగారు. వైసీపీ హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మించి కరకట్ట ప్రజలకు అండగా నిలిచాం. వాల్ నిర్మాణానికి వైఎస్ జగన్ గారు చిత్తశుద్ధితో కృషి చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తాం’ అని దేవినేని అవినాష్ అన్నారు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
‘విద్యార్థి నాయకుడుగా రాజకీయం ప్రారంభించి తిరుగులేని శక్తిగా నెహ్రూ ఎదిగారు. ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టారు. నెహ్రూది, వైఎస్ఆర్ గారిది రాజకీయాలలో ఒకటే నడవడిక. నమ్మిన వారి కోసం ఎక్కడ వరకు అయినా వెళ్తారు. వారి ఆశయ సాధనకు కృషి చేస్తాం. దేవినేని అవినాష్ కూడా రాజకీయాలలో నెహ్రూ అంత ఎత్తు ఎదగాలని కోరుకుంటున్నా’ అని వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం పేర్కొన్నారు.
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, ప్రజల కోసం ప్రజసేవలో నిరంతరం కృషి చేసిన మా అందరి ప్రజా నాయకులు మీరు..
మీరు భౌతికంగా మా మధ్య లేకపోయిన మీరు నేర్పిన మాట మరువం, మీరు చూపిన బాట విడవం.. నిరంతరం మీ ఆశయసాధనకే కట్టుబడి ఉంటాం.
ఇట్లు మీ దేవినేని అవినాష్#DevineniNehru #DevineniNehruLivesOn… pic.twitter.com/MuF2Ygl7FP
— Devineni Avinash (@DevineniAvi) April 17, 2025
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?