Kadapa: డిప్యూటీ సీఎం ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం.. విచారణ వేగవంతం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం
- సింహాద్రిపురం మండలంలోని దిద్దేకుంట గ్రామాన్ని పరిశీలించిన ఆర్డీఓ
- నాగేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ప్రదేశాన్ని పరిశీలించిన ఆర్డీఓ
- నాగేంద్ర కుటుంబ సభ్యులను చంపి ఆత్మహత్య చేసుకున్న నాగేంద్ర
- ఈ కేసులో 8 మందిని విచారించిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగం విచారణ వేగవంతం చేసింది. సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో నాగేంద్ర అనే రైతు అప్పుల బాధ తాళలేక తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. నిన్న రిమ్స్ హాస్పిటల్లో ఎంపీడీవో జవహార్ బాబును పరామర్శించడానికి వచ్చిన డిప్యూటీ సీఎం దృష్టికి రైతు ఆత్మహత్య ఘటన వచ్చింది.
Read Also: Pawan Kalyan: నితీష్ కుమార్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసల వర్షం..
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ఈ ఘటన పై ఆయన విచారం వ్యక్తం చేశారు. రైతు కుటుంబం మృతికి గల కారణాలను విచారణ చేసి.. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు పులివెందుల ఆర్డీఓ ఘటన స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలపై ఆరా తీశారు. నాగేంద్రకు అప్పు ఇచ్చిన ఎనిమిది మందిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే నాగేంద్ర మృతి చెందిన రోజు ఆయనకు 22 సార్లు ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకు నాగేంద్ర కుటుంబానికి 15 లక్షల రూపాయలు అప్పు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది.
Read Also: Manmohan Singh Cremation: పీవీకి మీరు చేసింది ఏమిటి..? కాంగ్రెస్వి చిల్లర రాజకీయాలు..
కాగా.. నిన్న (శనివారం) దిద్దేకుంట గ్రామంలో అప్పుల బాధ తాళలేక రైతు నాగేంద్ర దారుణానికి ఒడిగట్టాడు. భార్య, పిల్లలను చంపి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట భార్య వాణిని స్కూటర్ పై పొలం వద్దకు తీసుకెళ్లి తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత కొడుకు, కూతురును అదే విధంగా చంపేశాడు. కుటుంబ సభ్యులను హత్య చేసిన తర్వాత అదే తాడుతో ఆత్మహత్య చేసుకున్నాడు. కౌలుకు తీసుకుని పంటల సాగు చేసి అప్పుల పాలు కావడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..