Kadapa: డిప్యూటీ సీఎం ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం.. విచారణ వేగవంతం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం
- సింహాద్రిపురం మండలంలోని దిద్దేకుంట గ్రామాన్ని పరిశీలించిన ఆర్డీఓ
- నాగేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ప్రదేశాన్ని పరిశీలించిన ఆర్డీఓ
- నాగేంద్ర కుటుంబ సభ్యులను చంపి ఆత్మహత్య చేసుకున్న నాగేంద్ర
- ఈ కేసులో 8 మందిని విచారించిన పోలీసులు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగం విచారణ వేగవంతం చేసింది. సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో నాగేంద్ర అనే రైతు అప్పుల బాధ తాళలేక తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. నిన్న రిమ్స్ హాస్పిటల్లో ఎంపీడీవో జవహార్ బాబును పరామర్శించడానికి వచ్చిన డిప్యూటీ సీఎం దృష్టికి రైతు ఆత్మహత్య ఘటన వచ్చింది.
Read Also: Pawan Kalyan: నితీష్ కుమార్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసల వర్షం..
Also Read
- Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
- Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ఈ ఘటన పై ఆయన విచారం వ్యక్తం చేశారు. రైతు కుటుంబం మృతికి గల కారణాలను విచారణ చేసి.. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు పులివెందుల ఆర్డీఓ ఘటన స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలపై ఆరా తీశారు. నాగేంద్రకు అప్పు ఇచ్చిన ఎనిమిది మందిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే నాగేంద్ర మృతి చెందిన రోజు ఆయనకు 22 సార్లు ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకు నాగేంద్ర కుటుంబానికి 15 లక్షల రూపాయలు అప్పు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది.
Read Also: Manmohan Singh Cremation: పీవీకి మీరు చేసింది ఏమిటి..? కాంగ్రెస్వి చిల్లర రాజకీయాలు..
కాగా.. నిన్న (శనివారం) దిద్దేకుంట గ్రామంలో అప్పుల బాధ తాళలేక రైతు నాగేంద్ర దారుణానికి ఒడిగట్టాడు. భార్య, పిల్లలను చంపి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట భార్య వాణిని స్కూటర్ పై పొలం వద్దకు తీసుకెళ్లి తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత కొడుకు, కూతురును అదే విధంగా చంపేశాడు. కుటుంబ సభ్యులను హత్య చేసిన తర్వాత అదే తాడుతో ఆత్మహత్య చేసుకున్నాడు. కౌలుకు తీసుకుని పంటల సాగు చేసి అప్పుల పాలు కావడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!