Deputy CM Narayana Swamy : పుంగనూరు ఘటన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుంగనూరులో ఇటీవల చెలరేగిన హింస.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు-టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం మొదలై.. చివరకు లాఠీ ఛార్జ్ వరకు వెళ్లింది. అయితే.. చిత్తూరు పుంగనూరు అల్లర్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ప్రెస్ మీట్ లో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. పుంగనూరు ఘటనలో గాయపడ్డ పోలీసులకు, ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటన లో తీవ్రంగా గాయపడి ఒక కన్ను పోగొట్టుకొని, మరొక కన్ను కూడా పోగొట్టుకునే పరిస్ధితిలో ఉన్న రణధీర్ అనే కానిస్టేబుల్ కు పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. చంద్రబాబు, తన కుమారుడు ముఖ్యమంత్రి కాలేడన్న అక్కసుతోనే పధకం ప్రకారం, ముందస్తు ప్రణాళికతో అల్లర్లకు పురిగొల్పాడని ఆయన మండిపడ్డారు.
Also Read : Daya 2: ఆ అననుమానాలు తీర్చేసేది అప్పుడే.. దయా 2 రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?
Also Read
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
- Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
- Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
- Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
అంతేకాకుండా.. ‘తాము అనుమతి పొందిన రూట్ ను మార్చి పోలిసులపై బీర్ బాటిళ్ళు, రాళ్ళు , కత్తులు, కటార్లతో దాడి చేసారు. ఇంత జరిగినా సమన్వయాన్ని పాటించి , ఎలాంటి ఫైరింగ్ లు లేకుడా అల్లర్లను అణచివేసిన చిత్తూరు ఎస్పీ ని అభినందిస్తున్నాం. ఇంత దారుణానికి పాల్పడిన చంద్రబాబును ఈ కేసులో A1 గా చేర్చాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని చంద్రబాబు ఏమీ చేయలేడు. పోలీసులు ఎందుకు భయపడుతున్నాదో తెలియడం లేదు. చంద్రబాబును మొదటి ముద్దాయి ని చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నీచమైన, టెర్రరిజం, అభివృద్ది నిరోధక చరిత్ర. చంద్రబాబు హయాంలో ప్రజా సంకల్ప యాత్రలో చిన్న గొడవ జరగలేదు. భవిష్యత్తులో కూడా తన మనుషులను తానే చంపి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాడు. పాకిస్థాన్ లో బెనజీర్ బుట్టోను చేసినట్టే చంద్రబాబు ను చేయాలి. చిత్తూరు ఎస్పీ ని రెడ్ డైరీలో రాసామంటూ పేర్కొన్న లోకేష్ కు రాజకీయాలు తెలియదు. ఈలలేసుకుని తిరిగే పవన్ కల్యాణ్ కూడా పోలీసులపై జరిగిన దాడిని ఖండించకపోవడం శోచనీయం. మేము శాంతియుతంగా తిరుగుబాటు చేస్తాం. ఔరంగజేబుకు అన్నగా వ్యవహరిస్తున్న చంద్రబాబు జిల్లాలో పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్నందున కలెక్టర్, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలి.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Mallu Ravi: గద్దర్ మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు
తాజావార్తలు
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
-
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!