Bhatti Vikramarka: దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి ప్రజల సహకారం అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పాలని సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల, పొంగులేటితో పాటు అధికారులు పాల్గొన్నారు.
Read Also: CM Revanth Reddy : పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
Also Read
రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసమని, దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ వ్యయం రూ.1681కోట్లు కాగా.. రూ.889 కోట్లు 2014 కంటే ముందే ప్రభుత్వం ఖర్చు చేసిందని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా తెలిపారు. ఇందిరా సాగర్ వ్యయం రూ.1824 కోట్లు కాగా.. 1064 కోట్లు ఖర్చు చేశారన్నారు. రెండు ప్రాజెక్టులకు మిగతా రూ.1552 కోట్లు ఖర్చు చేస్తే 4లక్షల ఎకరాలకు నీరు అందేదని ఆయన వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు అని పేరు చెప్పి 18500 కోట్లకు కేసీఆర్ ప్రభుత్వం అంచనా వ్యయం పెంచిందని.. కానీ కొత్త ఆయకట్టు లేదని మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. సీతమ్మ బ్యారేజీకి నీటిని అందించేందుకు రూ. 3,486 కోట్లకు ప్రాజెక్టు ఖర్చు అంచనా వేయగా.. కానీ మొత్తం రూ.4,481కోట్లు ఖర్చు చేశారన్నారు. రీడిజైన్ పేరుతో ఒక్క ఎకరానికి నీరు అందివ్వ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి మూడు సంవత్సరాల్లో సంవత్సరానికి రూ.500 కోట్లు ఖర్చు చేస్తే వేల ఎకరాలకు నీరు వచ్చేదన్నారు. దోపిడీ నుంచి రాష్టాన్ని కాపాడటానికి ప్రజల సహకారం అవసరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటే చూస్తే ఊరుకుంటే కడుపు తరుక్కు పోతుందన్నారు.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
-
OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
-
OTR: తుపాకి వదిలి ప్రజాస్వామ్య బాటలో.. దేవ్ జీ పొలిటికల్ ఎంట్రీపై చర్చ
-
Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
-
Story Board: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!