Delhi : ఢిల్లీలో త్రిపుల్ మర్డర్.. పెళ్లి రోజే విషాదం.. తల్లిదండ్రులు, కూతురు దారుణ హత్య
- రాజధానిలో త్రిపుల్ మర్డర్
- పెళ్లి రోజే కన్నుమూసిన దంపతులు
- తల్లిదండ్రులు, కూతురు దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi : ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ట్రిపుల్ మర్డర్ సంచలనం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కత్తితో పొడిచి చంపారు. ఇంట్లో తల్లిదండ్రులు, కుమార్తె మృతదేహాలు లభ్యమయ్యాయి. హత్య జరిగిన సమయంలో కొడుకు మార్నింగ్ వాకింగ్కు వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి ముగ్గురూ హత్యకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Tragedy: విషాదం.. మిద్దె కూలి ముగ్గురు మృతి
Also Read
- CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
- Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
- CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
Triple murder in Delhi | Three people from a house including a man, his wife and daughter, in the Neb Sarai area of South Delhi were stabbed to death. Their son-fourth member of the family had gone out for a walk. Police are present at the spot. More details awaited: Delhi…
— ANI (@ANI) December 4, 2024
కుమారుడిని పోలీసులు విచారిస్తున్నారు. ఉదయాన్నే వాకింగ్కి వెళ్లానని చెప్పారు. ఇంట్లో తండ్రి రాజేష్, తల్లి కోమల్, సోదరి కవిత ఉన్నారు. తిరిగి వచ్చి చూసే సరికి ఇంట్లో ముగ్గురి మృతదేహాలు రక్తంతో కనిపించాయి. ముగ్గురిని కత్తులతో పొడిచి హత్య చేశారు. రాజేష్ స్వస్థలం హర్యానా. అతను చాలా సంవత్సరాల క్రితం ఢిల్లీకి వచ్చి నెబ్ సరాయ్ ప్రాంతంలోని డియోలీ గ్రామంలో నివసిస్తున్నాడు. చుట్టుపక్కల వ్యక్తుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
Read Also:Bradman Baggy Green: వేలంలో కోట్లు పలికిన బ్రాడ్మన్ ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్
#WATCH | Delhi: Three people from a house including a man, his wife and daughter, in the Neb Sarai area of South Delhi were stabbed to death. More details awaited: Delhi Police
(Visuals from the spot) pic.twitter.com/aYSU48aC1G
— ANI (@ANI) December 4, 2024
కుటుంబంలో మిగిలిన కుమారుడు డిసెంబర్ 4 తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం అని చెప్పాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో నిద్రలేచి వాకింగ్కు ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలిపారు. 7 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చేసరికి ముగ్గురూ హత్యకు గురయ్యారు. ఇంట్లో తల్లిదండ్రులు, సోదరి మృతదేహాలను చూసి ఆమె కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల నుంచి జనం గుమిగూడారు. ముగ్గురు వ్యక్తుల మెడపై కత్తితో దాడి చేసి హత్య చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
-
SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
-
RCB IPL 2026 Playoffs: ఆర్సీబీకి భారీ షాక్.. ప్లేఆఫ్స్ రేసులో కొత్త టెన్షన్!
-
DRDO TARA Test: డీఆర్డీఓ స్వదేశీ ‘తారా’ కిట్ టెస్ట్ సక్సెస్.. శత్రువులకిక దబిడి దిబిడే
-
Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!