Demanding Bribe : అచ్చం సినిమా మాదిరి.. ఫౌడర్ చల్లారు పట్టుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Demanding Bribe : లంచం డిమాండ్ చేసిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఈస్ట్ షాలిమార్ బాగ్లో ఓ ఇంటి నిర్మాణానికి బదులుగా లంచం డిమాండ్ చేసినందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) అధికారిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) హెడ్ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (జేసీపీ) మధుర్ వర్మ తెలిపిన వివరాలు, తూర్పు షాలిమార్ బాగ్లో నివాసం ఉంటున్న సౌరభ్ జైన్ అనే వ్యక్తి ఇంటిని నిర్మించాలనుకున్నాడు. ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్మాణానికి అనుమతి కోసం మున్సిపల్ అధికారి నారాయణ్ ను ఆశ్రయించాడు. దీంతో అతడు రూ. లక్ష డిమాండ్ చేశాడు. లంచం ఇచ్చేందుకు ఇష్ట పడని సౌరభ్ అన్నయ్య రాజీవ్ మంగళవారం అవినీతి నిరోధక శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. తగిన బేరసారాల తర్వాత రూ.10వేలకు నారాయణ ఒప్పుకున్నట్లు రాజీవ్ చెప్పినట్లు జేసీపీ తెలిపారు.
Read Also: Election Results: నేడు 3రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఏ పార్టీ జెండా ఎగిరేనో..?
Also Read
- Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
- Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
ఎలాగైన అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని పోలీసులు రైడింగ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారుడికి ఫినాఫ్తలీన్ ఫౌడర్ చల్లిన రూ.పదివేల నోట్లను ఇచ్చారు. ఆ తర్వాత ఫిర్యాదుదారు నారాయణ్ను సంప్రదించి మీటింగ్ పాయింట్ను ఫిక్స్ చేశారు. ఫిర్యాదుదారుడితో పాటు రైడింగ్ బృందం మీటింగ్ పాయింట్కు వెళ్లింది. సాయంత్రం 4:30 గంటలకు, రైడింగ్ బృందం ఫిర్యాదుదారుతో కలిసి ఢిల్లీలోని షాలిమార్ బాగ్లోని మీటింగ్ పాయింట్కి చేరుకున్నారు. నారాయణ్ అప్పటికే అక్కడ ఉన్నాడు.. ఫిర్యాదుదారుడి కోసం కారులో వేసినట్లు పోలీసులు తెలిపారు. కొంత చిట్-చాట్ తర్వాత, నారాయణ్ ఫిర్యాదుదారు నుండి లంచం డబ్బు డిమాండ్ చేశాడు. దీనిపై ఫినాల్ఫ్తాలిన్ పౌడర్ కలిపిన రూ.10,000ను ఫిర్యాదుదారు అందజేశారు. ఆ తర్వాత రైడింగ్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసుల పార్టీని చూసి నారాయణ్ పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని రైడింగ్ టీం అతడిని ముట్టడించింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి రూ.10వేలు లంచం స్వాధీనం చేసుకున్నారు. అతనిపై సెక్షన్ 7 పీఓసీ యాక్ట్, పీఎస్ ఏసీబీ కింద కేసు నమోదు చేశారు. అనే కోణంలో తదుపరి విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
-
Manchu Manoj: మంచు మనోజ్ టీమ్లో మిస్టరీ డెత్.. ‘డేవిడ్ రెడ్డి’ సెట్స్లో అసలేం జరిగింది?
-
Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
-
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..