Demanding Bribe : అచ్చం సినిమా మాదిరి.. ఫౌడర్ చల్లారు పట్టుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Demanding Bribe : లంచం డిమాండ్ చేసిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఈస్ట్ షాలిమార్ బాగ్లో ఓ ఇంటి నిర్మాణానికి బదులుగా లంచం డిమాండ్ చేసినందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) అధికారిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) హెడ్ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (జేసీపీ) మధుర్ వర్మ తెలిపిన వివరాలు, తూర్పు షాలిమార్ బాగ్లో నివాసం ఉంటున్న సౌరభ్ జైన్ అనే వ్యక్తి ఇంటిని నిర్మించాలనుకున్నాడు. ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్మాణానికి అనుమతి కోసం మున్సిపల్ అధికారి నారాయణ్ ను ఆశ్రయించాడు. దీంతో అతడు రూ. లక్ష డిమాండ్ చేశాడు. లంచం ఇచ్చేందుకు ఇష్ట పడని సౌరభ్ అన్నయ్య రాజీవ్ మంగళవారం అవినీతి నిరోధక శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. తగిన బేరసారాల తర్వాత రూ.10వేలకు నారాయణ ఒప్పుకున్నట్లు రాజీవ్ చెప్పినట్లు జేసీపీ తెలిపారు.
Read Also: Election Results: నేడు 3రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఏ పార్టీ జెండా ఎగిరేనో..?
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఎలాగైన అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని పోలీసులు రైడింగ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారుడికి ఫినాఫ్తలీన్ ఫౌడర్ చల్లిన రూ.పదివేల నోట్లను ఇచ్చారు. ఆ తర్వాత ఫిర్యాదుదారు నారాయణ్ను సంప్రదించి మీటింగ్ పాయింట్ను ఫిక్స్ చేశారు. ఫిర్యాదుదారుడితో పాటు రైడింగ్ బృందం మీటింగ్ పాయింట్కు వెళ్లింది. సాయంత్రం 4:30 గంటలకు, రైడింగ్ బృందం ఫిర్యాదుదారుతో కలిసి ఢిల్లీలోని షాలిమార్ బాగ్లోని మీటింగ్ పాయింట్కి చేరుకున్నారు. నారాయణ్ అప్పటికే అక్కడ ఉన్నాడు.. ఫిర్యాదుదారుడి కోసం కారులో వేసినట్లు పోలీసులు తెలిపారు. కొంత చిట్-చాట్ తర్వాత, నారాయణ్ ఫిర్యాదుదారు నుండి లంచం డబ్బు డిమాండ్ చేశాడు. దీనిపై ఫినాల్ఫ్తాలిన్ పౌడర్ కలిపిన రూ.10,000ను ఫిర్యాదుదారు అందజేశారు. ఆ తర్వాత రైడింగ్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసుల పార్టీని చూసి నారాయణ్ పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని రైడింగ్ టీం అతడిని ముట్టడించింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి రూ.10వేలు లంచం స్వాధీనం చేసుకున్నారు. అతనిపై సెక్షన్ 7 పీఓసీ యాక్ట్, పీఎస్ ఏసీబీ కింద కేసు నమోదు చేశారు. అనే కోణంలో తదుపరి విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!