Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Tripura Nagaland And Meghalaya Assembly Poll Results Today

Election Results: నేడు 3రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఏ పార్టీ జెండా ఎగిరేనో..?

Published Date :March 2, 2023 , 7:24 am
By Rakesh Reddy
Election Results: నేడు 3రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఏ పార్టీ జెండా ఎగిరేనో..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Election Results: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మరి కొన్ని గంటల్లో ఈ మూడు రాష్ట్రాల్లో పరిస్థితి తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. మేఘాలయలో హంగ్ అసెంబ్లీ ఏర్పడనుంది. అందుకే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా.. లేక ప్రజాభిప్రాయం మరేదైనా ఉంటుందా అనే దానిపై అందరి దృష్టి పడింది.

త్రిపుర తీర్పు ఎటు?
త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 16న పోలింగ్ జరిగింది. సాయంత్రం 4 గంటల వరకు 81.1 శాతం ఓటింగ్ జరిగింది. మొత్తం 3337 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. వీటిలో 1,100 పోలింగ్‌ కేంద్రాలు సున్నితమైనవి కాగా, 28 పోలింగ్‌ కేంద్రాలు అత్యంత సున్నితమైనవి. ఈ ఎన్నికల్లో మొత్తం 259 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే గత ఐదేళ్లుగా డబుల్ ఇంజన్( కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండడం) ప్రభుత్వం చేసిన కృషి వల్ల దేశ సరిహద్దు రాష్ట్రమైన త్రిపుర లో అభివృద్ధి పుంజుకుంటోందని బిజేపీ నాయకులు భారీగా ప్రచారం చేశారు. ఇండైజీనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర( ఐ.పి.ఎఫ్.టి) భాగస్వామ్యంతో ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రద్యూత్ దేవ్ వర్మ నేతృత్వంలోని తిప్రా మోతా పార్టీ ‘గ్రేటర్ తిప్రాలాండ్’ను డిమాండ్ చేస్తూ 42 శాసన సభా స్థానాల్లో పోటీ చేసింది. మొత్తం 60 త్రిపుర అసెంబ్లీ స్థానాలకు గాను, త్రిణమూల్ కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేయగా, వామపక్ష కూటమి 47 అసెంబ్లీ స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో, బీజేపీ 55 స్థానాల్లో పోటీ చేసింది. త్రిపురలో మొత్తం 21 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంచి.

Also Read

  • CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
  • RCB Vs DC: విరాట్‌ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే.. 
  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
  • CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?

Read Also: Revanth Reddy : ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే గడ్డ కరీంనగర్

తేలనున్న 183మంది భవితవ్యం..
నాగాలాండ్‌లో 183 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. రాష్ట్రంలోని 59 స్థానాలకు 183 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో మొత్తం 13 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 82.42% ఓటింగ్ నమోదైంది. బీజేపీ, నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ( ఎన్.డి.పి.పి) లు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అయితే, ఈసారి పొత్తుకుదరకపోవడంతో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఎన్.డి.పి.పి 40 స్థానాలు, బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేయగా.. ఒక స్థానంలో బీజేపీ పోటీ లేకుండానే గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 23 స్థానాల్లో పోటీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తులపై ఆలోచిస్తామని నాగా పీపుల్స్ ఫ్రంట్( ఎన్.పి.పి) ప్రకటించింది. రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ 16 స్థానాల్లో పోటీ చేసింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం నాగాలాండ్ లో అధికార కూటమి నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, బిజేపి 38 నుంచి 48 స్థానాల్లో గెలుపొందుతుందని అంచనాలున్నాయి.

Read Also: Off The Record: లాబీయింగ్ వర్కవుట్ అయ్యేనా?

మేఘాలయలో మెజార్టీ ఎవరిది?
మేఘాలయలో మొత్తం 60 స్థానాలకు గాను 59 స్థానాలకు పోలింగ్ జరిగింది. 21.6 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 369 మంది ఓటర్ల భవితవ్యం నేడు తేలనుంది. పోటీలో మొత్తం 36 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఫిబ్రవరి 27న 74.32% ఓటింగ్ జరిగింది. మొత్తం 3,419 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. వీటిలో 640 పోలింగ్‌ కేంద్రాలు అసురక్షితమైనవి కాగా, 323 పోలింగ్‌ కేంద్రాలు సున్నితమైనవి. మాజీ హోం మంత్రి, యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ ( యు.డి.పి) అభ్యర్థి హెచ్.డి.ఆర్. లింగ్డో హఠాన్మరణంతో షోహియాంగ్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. బీజేపీతో కలిసి, గతంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్.పి.పి) ఎన్నికల్లో ఈ సారి విడివిడిగా పోటీ చేసింది. ఎన్.పి.పి 56 స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 59 స్థానాల్లో పోటీ చేశాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ విస్తృతపరచాలని భావిస్తున్న త్రిణమూల్ కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలైన యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తో కలిసి మేఘాలయలో 57 స్థానాల్లో పోటీ చేసింది. మేఘాలయలో ఏ పార్టీకి తగిన మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • assembly poll results
  • election commission
  • election results 2023
  • Meghalaya
  • Nagaland

తాజావార్తలు

  • CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!

  • RCB Vs DC: విరాట్‌ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే.. 

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Producing States in India: భారత్‌లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?

  • CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions