Delhi: ఇండియా కూటమి నేతలపై పిల్.. హైకోర్టు ఏం చేసిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఇండియా కూటమి నేతలు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్లపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆ ముగ్గురు నేతలపై చర్యలు తీసుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోంశాఖలను ఆదేశించాలంటూ పిటిషనర్ సూర్జిత్ సింగ్ యాదవ్ చేసిన రిక్వెస్ట్ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు మేర పారిశ్రామికవేత్తల రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిందని రాహుల్, అఖిలేష్, కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ , జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషన్ను కొట్టివేసింది.
Also Read
- Ayatollah Khamenei: చనిపోయిన 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. ఇన్నాళ్లు ఎక్కడ ఉంచారు.?
- Allahabad High Court: హలాలా, ట్రిపుల్ తలాక్ పేరుతో లైంగిక దోపిడీ.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
- 14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
- RSS: భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.. ఆయోధ్య నిందితులను శిక్షించాలన్న ఆర్ఎస్ఎస్
భారతీయ ఓటర్ల జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయలేమని.. ఎవరు నిజం మాట్లాడుతున్నారో.. ఎవరు అబద్ధాలు చెబుతున్నారో వారికి తెలుసు అని ధర్మాసనం పేర్కొంది. ఎవరు నాయకత్వం వహిస్తున్నారో.. ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో దేశ ప్రజలకు తెలుసు అని.. ప్రజలే నిర్ణయం తీసుకుంటారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. విపక్ష నేతల వ్యాఖ్యల వల్ల ఎవరైనా పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది కలిగితే.. వారే నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని.. థర్డ్ పార్టీ ద్వారా పిల్ వేయాల్సిన అవసరం ఏముంటుందని కోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
Ayatollah Khamenei: చనిపోయిన 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. ఇన్నాళ్లు ఎక్కడ ఉంచారు.?
-
Srinivasa Mangapuram: జూలై 30న ‘శ్రీనివాస మంగాపురం’
-
RC 17: సుకుమార్ – దేవిశ్రీ కాంబోకి బ్రేక్.. నిజమేనా?
-
Allahabad High Court: హలాలా, ట్రిపుల్ తలాక్ పేరుతో లైంగిక దోపిడీ.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
ట్రెండింగ్
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల