Delhi CM Kejriwal : ప్రధానికి కేజ్రీవాల్ లేఖ.. రైల్వేలో వృద్ధులకు మినహాయింపు ఇవ్వండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi CM Kejriwal : రైల్వేలో వృద్ధులకు మినహాయింపు ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖ ద్వారా ప్రధానిని ఆయన టార్గెట్ చేశారు. వృద్ధుల మినహాయింపును రద్దు చేయడం చాలా దురదృష్టకరమని.. వారి ఆశీర్వాదం లేకుండా దేశం అభివృద్ధి చెందదని కేజ్రీవాల్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీల రాయితీని రద్దు చేసి చాలా కాలం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ విషయమై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధానిని కోరారు.
Read Also: Pawan Kalyan Delhi Tour: ఢిల్లీలో జనసేనాని.. ఇద్దరు కీలక నేతలతో భేటీ..!
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
రూ.1600 కోట్లు ఆదా చేసేందుకు వృద్ధులకు రాయితీ తొలగించడం సరికాదన్నారు. వృద్ధులను తీర్థయాత్రలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం తన బడ్జెట్లో 50 కోట్లు ఖర్చు చేస్తుందని, తద్వారా ప్రభుత్వానికి ఎటువంటి నష్టం జరగదన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా చేయాలని కేజ్రీవాల్ తన లేఖలో రాశారు. వాస్తవానికి, కోవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, సీనియర్ సిటిజన్లతో సహా మూడు కేటగిరీలు మినహా మిగిలిన అన్నింటికి ఛార్జీల మినహాయింపును రైల్వే నిలిపివేసింది. కరోనా మహమ్మారికి ముందు, 60 ఏళ్లు పైబడిన పౌరులు 50 శాతం తగ్గింపు పొందేవారు. మహమ్మారి ముప్పు తగ్గిన తర్వాత, దేశంలోని అన్ని ఇతర కార్యకలాపాలు పూర్తిగా సాధారణమైన తర్వాత కూడా సీనియర్ సిటిజన్లకు ఈ ఉపశమనం పునరుద్ధరించబడలేదు. దిల్లీ సీఎం కేజ్రీవాల్తో సహా పలు పార్టీల నేతలు చాలా కాలంగా దీనిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!