Bomb threat: ఢిల్లీ ఎయిర్పోర్టుకు బాంబ్ బెదిరింపు.. పోలీసుల తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మధ్యాహ్నం రెండు ఆస్పత్రులకు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు రాగా.. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. తాజాగా ఢిల్లీ ఎయిర్పోర్టుకు కూడా బెదిరింపు వచ్చింది. దీంతో ఫైర్ సిబ్బంది, బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల వేళ బెదిరింపు కాల్స్ రావడంతో సీరియస్గా తీసుకుని సెర్చ్ చేశారు.
ఇది కూడా చదవండి: Chennai Super Kings: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డు!
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
మధ్యాహ్న సమయంలో బురారీ ఆస్పత్రికి, సంజయ్ గాంధీ ఆస్పత్రికి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్స్ అణువణువూ తనిఖీలు చేపట్టింది. కొద్ది రోజుల క్రితమే స్కూల్స్కు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఆస్పత్రులకు బెదిరింపు కాల్స్ రావడంతో తనిఖీలు చేపట్టారు. రెండు ఆస్పత్రుల దగ్గర సోదాలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ.. డివైజ్లు గానీ దొరకలేదని పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3:15 గంటలకు ఢిల్లీలోని బురారి ఆస్పత్రికి తొలుత బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. అనంతరం సాయంత్రం 4:26 గంటలకు సంజయ్ గాంధీ ఆస్పత్రికి రెండో బెదిరింపు వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మూడో బెదిరింపు.. సాయంత్రం 6:15 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్టుకు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు.
ఇది కూడా చదవండి: Jharkhand: భారీగా నోట్ల కట్టలు బయటపడిన కేసులో మంత్రికి ఈడీ సమన్లు
ఇదిలా ఉంటే గత వారం ఢిల్లీ, గుజరాత్లోని అహ్మదాబాద్లోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు తనిఖీలు చేపట్టి అవి బూటకమని తేల్చారు. మే 2న ఢిల్లీలోని 131, గురుగ్రామ్లోని ఐదు, నోయిడా, గ్రేటర్ నోయిడాలోని మూడు పాఠశాలలకు ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులు పంపారు.
ఇది కూడా చదవండి: Indonesia: ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. 11 మంది టీచర్లు, విద్యార్థుల మృతి
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?