Wayanad Landslides: 88కు చేరిన మృతుల సంఖ్య.. రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం
- వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటికి 88 మంది మృతి
- జూలై 30.. 31న రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం
- రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు.. వేడుకలు వాయిదా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయనాడ్లో రుతుపవన వర్షాల కారణంగా సంభవించిన పలు కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకూ దాదాపు 88 మంది మరణించారు. 116 మంది తీవ్ర గాయాలతో ఉన్న వారిని రెస్క్యూ టీం కాపాడారు. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం జూలై 30, 31న రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, వేడుకలను వాయిదా వేసింది. ఈ ప్రమాదంలో వందలాది మంది మట్టి, శిథిలాల కింద చిక్కుకుపోయారు. పదుల సంఖ్యలో మృతదేహాలను 30 కిలోమీటర్ల అవతల ఉన్న చలయార్ నదిలో తేలియాడుతుండగా పోలీసులు గుర్తించారు. ముండకై తేయాకు పరిశ్రమ పనిచేస్తున్న ఆరు వందల మంది కార్మికులు గల్లంతు అయ్యారు. వారి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటి దాక కార్మికుల జాడ తెలియలేదు.
Read Also: Rafale Jets: రాకెట్ దూసుకెళ్తుండగా తోడుగా వెళ్లిన రఫేల్ యుద్ధ విమానాలు.. వీడియో వైరల్
Also Read
- Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
- Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
వరదల ధాటికి సెల్ ఫోన్ టవర్స్ కొట్టుకొని పోవడంతో వారు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అస్సాం, పశ్చిమబెంగాల్ నుండి వచ్చి తేయాకు తేటలో వారు పనిచేస్తున్నారు. వరదలకు టీ ఎస్టేట్ పూర్తిగా కొట్టుకుని పోయింది. కాగా.. ఇప్పటి వరకు 146 మందిని రెస్క్యూ టీం కాపాడింది. నాలుగు గ్రామాల్లో దాదాపు 1200 వరకు రాళ్ళ కింద చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన జనాలను బయటకు తీసుకురావడానికి ఎన్డిఆర్ఎఫ్తో సహా పలు ఏజెన్సీలు, సైన్యం సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది.
Read Also: Puja khedhkar: ముందస్తు బెయిల్ కోసం పూజా ఖేద్కర్ ఢిల్లీ కోర్టులో పిటిషన్
తాజావార్తలు
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?