Sushant Singh Rajput: “నాలుగేళ్లయినా..మరణం మిస్టరీగానే మిగిలింది.”..భావోద్వేగానికి లోనైన సుశాంత్ సింగ్ సోదరి
- జూన్ 14-2020న ఏం జరిగిందో చెప్పండని వేడుకున్న సోదరి శ్వేతా
- ఇది రాజకీయ ఎజెండాగా ఎందుకు మారిందని ప్రశ్న
- ఎన్ని సార్లు అధికారులను వేడుకున్న న్యాయం జరగలేదని ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ (Sushant Singh Rajput)వర్ధంతి నేడు. 2020 జూన్ 14న ఆయన ముంబై లో తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయారు. హీరోగా రాణిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న తరుణంలో 34 ఏళ్ల సుశాంత్ బలవన్మరణం అందరినీ ఆశర్చపరిచింది. ఆయన మనకు దూరమై నాలుగేళ్లు అవుతుంది. అయితే సుశాంత్ (Sushant) ఆతహత్య చేసుకోలేదని, చంపబడ్డారంటూ ఆయన మరణంపై ఆయన అభిమానులు, వీడియా, ప్రజలు చాలా అనుమానాలనే వ్యక్తం చేశారు. కంగనా రనౌత్ వంటి వ్యక్తులైతే బహిరంగంగా నెపోటిజంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సినీ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వచ్చి హీరోగా ఎదుగుతున్న వ్యక్తిని ఎదగనీయకుండా చేశారని, అవకాశాలు రానీయకుండా అడ్డుపడ్డారని.. దాంతోనే ఆయన డిప్రెషన్కి లోనై ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఆయన సోదరి సుశాంత్ సింగ్ రాజ్పుత్ నాలుగో వర్ధంతి సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్టు చేసింది. అది ఇప్పుడు వైరల్ గా మారింది.
READ MORE: Dolly Chaiwala: హైదరాబాద్లో ప్రత్యక్షమైన డాలీ చాయ్వాలా.. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ జనం.. (వీడియో)
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
దివంగత నటుడి సోదరి శ్వేతా సింగ్ కీర్తి కూడా త్రోబాక్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో సుశాంత్ సింగ్ తన సోదరీమణులతో సరదాగా గడిపాడు. క్యాప్షన్లో శ్వేత “భాయ్, మీరు మమ్మల్ని విడిచిపెట్టి 4 సంవత్సరాలు అయ్యింది. జూన్ 14, 2020న ఏం జరిగిందో మాకు ఇంకా తెలియదు. మీ మరణం మిస్టరీగా మిగిలిపోయింది. నేను నిస్సహాయంగా భావిస్తున్నాను. నిజం కోసం లెక్కలేనన్ని సార్లు అధికారులను వేడుకున్నాను. నేను నా సహనాన్ని కోల్పోతున్నాను. వదులుకోవాలని భావిస్తున్నాను. అయితే చివరి సారిగా.. ఈ కేసులో సహాయం చేయగల ప్రతి ఒక్కరినీ మీ గుండెల మీద చేయి వేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోమని కోరుతున్నాను. మా సోదరుడు సుశాంత్కు ఏమి జరిగిందో తెలుసుకునే అర్హత మాకు లేదా? ఇది రాజకీయ ఎజెండాగా ఎందుకు మారింది? ఆ రోజు ఏం దొరికింది.. ఏమి జరిగిందో సూటిగా ఎందుకు చెప్పడం లేదు? దయచేసి, నేను అభ్యర్థిస్తున్నాను..వేడుకుంటున్నాను. మనం కుటుంబంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి.” ఇలా రాసుకొచ్చింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!