DCP Rashmi Perumal : టవర్లకు ఉండే రేడియో రిమోట్ యూనిట్లు, హెడ్స్ చోరీ.. నిందితులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలోని సెల్ఫోన్ టవర్లపై పరికరాలను చోరీ చేస్తున్న నిందితుల అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ మీడియా తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టవర్లకు ఉండే రేడియో రిమోట్ యూనిట్లు, హెడ్స్ చోరీ చేస్తున్నారని, ఈ పరికరాలు మొబైల్ టవర్స్ లో వాడతారు.. మొబైల్ సిగ్నల్స్ అందడానికి ఈ పరికరాలు అత్యవసరమని ఆమె తెలిపారు. అయితే.. సౌత్ జోన్ టాస్క్ఫోర్స్, కాచిగూడ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. నిందితుల నుంచి 60 నుండి 70 లక్షల విలువ చేసే పరికరాలు స్వాధీనం చేసుకున్నామని ఆమె తెలిపారు.
అంతేకాకుండా..’రెగ్యులర్గా టవర్ల కు సంబంధించిన పరికరాలు చోరీ అవుతున్నాయని ఫిర్యాదులు అందాయి. దీంతో నిఘా పెట్టాం… టవర్ల పరికరాలను ఇన్స్టాల్ చేసే వారే ఈ చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించాము.. సాధారణ వ్యక్తులు టవర్లకు ఈ పరికరాలను సెట్ చేయలేరు.. అలాగే రిమూవ్ చేయలేరు. ఇన్స్టాల్ చేయడానికి నాలెడ్జ్ ఉన్నవారే ఈ చోరీలకు పాల్పడ్డారు.. టవర్లలో ఈ పరికరాలను పిలుస్తాం చేయడానికి అనుభవం ఉన్న వారిని సెల్యులార్ కంపెనీలు హైర్ చేసుకుంటాయి.. ఇలా సెల్యూలర్ కంపెనీలో నిందితులు తొమ్మిది మంది పనిచేస్తున్నారు. టవర్లకు పరికరాలు ఇన్స్టాల్ చేసిన మరుసటి రోజు వేరే వచ్చి ఆ పరికరాలను దొంగిలిస్తారు. టవర్లకు చెందిన పరికరాలు చోరీ చేయడంలో నాగరాజు, నగేష్ ప్రధాన నిందితులు కాక మరో ఐదుగురు రిసీవర్లు ఉన్నారు..
Also Read
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
- YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
ఇలా చోరీ చేసిన ఈ పరికరాలను ఢిల్లీలోని రిసీవర్లకు పంపుతారు. ఢిల్లీలో 500 రిసీవర్లు ఉన్నారు… చోరీ చేసిన సెల్యూలర్ కంపెనీ పరికరాలు దేశంలో వాడితే ఆయా సెల్లులార్ కంపెనీలు ఐడెంటిఫై చేస్తారు.. దీంతో చోరీ చేసిన పరికరాలను విదేశాలకు వివిధ మార్గాల్లో పంపుతున్నారు. చోరీ చేసిన పరికరాలను ఒక్కొక్కటి మూడు లక్షల వరకు విక్రయిస్తున్నారు. నిందితులు చాలాకాలంగా ఈ చోరీలకు పాల్పడుతున్నారు.. జియో టవర్లకు చెందిన పరికరాలను చైతన్య, రవి నాయక్ అనే వ్యక్తులు చోరీ చేశారు..’ అని డీసీపీ రేష్మి పెరుమాళ్ తెలిపారు.
తాజావార్తలు
-
Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
-
FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
-
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?