DCP Padmaja: ఉప్పల్లో ఈ నెల 21న జరిగిన హత్య కేసును చేధించిన పోలీసులు
ఉప్పల్లో ఈ నెల 21వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆదర్శ్ నగర్ లో ఈ నెల 21 వ తేదీన సాయికుమార్ అనే వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ నెల 22 వ తేదిన సాయి కుమార్ చనిపోయాడు. అయితే నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఈ కేసుల మల్కాజ్గిరి డీసీపీ పద్మజ మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీన జరిగిన మర్డర్ కేసును చేధించామని, వరుసకు మరదలు అయ్యే మహిళను లైంగికంగా వేధించడమే కాక ఆమె కూతుళ్ళను వేధించడమే హత్యకు కారణమని ఆమె పేర్కొన్నారు. శారద ఆమె బంధువులు కత్తితో దాడి చేసినట్లు గుర్తించామని, హత్య కేసును చేధించేందుకు మూడు టీమ్ లను ఏర్పాటు చేశామని ఆమె వెల్లడించారు. సంఘటనా స్థలంలో కారంపొడి తో పాటు రక్తపు నమూనాలను సేకరించామని, సంఘటనకి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్ లను సేకరించామని ఆమె తెలిపారు.
Anudeep: తొలిసారిగా చెప్పులేసుకుని షాకిచ్చిన అనుదీప్.. ఇదేందయ్యా ఇది
శారద అనే మహిళ హత్యకు గురైన సాయికి మరదలు వరుస అవుతుందని, భర్త చనిపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలు తో కలిసి ఉంటుందన్నారు. ఈమెను సాయికుమార్ వేధింపులకు గురి చేస్తుండేవాడని, ఈ వేధింపులు భరించలేక సాయికుమార్ పై గతంలో పోలీసులకు శారత ఫిర్యాదు చేసిందని ఆమె వెల్లడించారు. అయినప్పటికీ సాయిలో మాత్రం మార్పు రాలేదని, శారదతో పాటు ఆమె ఇద్దరు ఆడ పిల్లలపై సాయికుమార్ కన్నేశాడని, దీంతో సాయికుమార్ కి ఎలాగైన బుద్ధి చెప్పాలని అనుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే శారదకు సమీప బంధువు పాత నేరస్తుడైన దీపక్ కు విషయం చెప్పిందని, శారద, దీపకుమార్, బాలకృష్ణ మరో వ్యక్తి కలిసి పక్క ప్లాన్ ప్రకారం సాయికుమార్ పై దాడి చేశారని ఆమె వెల్లడించారు. సాయికుమార్ కళ్లల్లో శారద కారంపొడి కొట్టిగా, దీపక్ మిగతా వాళ్ళు అతనిపై కత్తులతో దాడి చేశారని, కత్తిపోట్లకు గురైన మరుసటి రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయి చనిపోయాడని డీసీపీ పద్మజ తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!