Delhi: ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో పట్టపగలు కాల్పులు.. రోగి అక్కడికక్కడే మృతి
- బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు.. రోగిపై కాల్పులు
- దీంతో రోగి అక్కడికక్కడే మృతి
- సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో పట్టపగలు బుల్లెట్లు పేలాయి. బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు రోగిపై కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో రోగి అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయిన రోగిని 32 ఏళ్ల రియాజుద్దీన్గా గుర్తించారు. రోగి కొన్ని వారాల కిందట ఆస్పత్రిలో చేరారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నాలుగు గంటల సమయంలో 18 ఏళ్ల యువకుడు ఆసుపత్రి లోపలికి వచ్చి రియాజుద్దీన్పై కాల్పులు జరిపాడు. అతడు 3-4 రౌండ్ల బుల్లెట్లు కాల్చాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రియాజుద్దీన్కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతనితో పాటు మరో ఇద్దరు అక్రమార్కులు కూడా ఉన్నట్లు సమాచారం.
READ MORE: Bandi Sanjay: Bandi Sanjay’s sensational comments on Harish Rao..
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్ర వేళ పోలీస్ స్టేషన్ కు జీటీబీ ఆస్పత్రి నుంచి పీసీఆర్ కాల్ వచ్చింది. ఆసుపత్రిలోని 24వ వార్డులో కాల్పులు జరిగినట్లు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఢిల్లీలోని శ్రీరామ్ నగర్ ఖజూరి నివాసి రియాజుద్దీన్ పై దుండగులు కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ఈ కాల్పుల్లో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. జూన్ 23న రియాజుద్దీన్ కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. రియాజుద్దీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా…దేశ రాజధాని ఢిల్లీలో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. అంతకుముందు జూలై 13న రాజధానిలోని లజ్పత్ నగర్లో ర్యాపిడ్ ఫైరింగ్ జరిగింది. దుండగులు సుమారు 10-12 రౌండ్లు కాల్పులు జరిపారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!