Hanmakonda: అత్తింటి వేధింపులు.. ఇంటిముందు టెంట్ వేసి నిరసన తెలిపిన కోడలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanmakonda: వరకట్నం అడగడం, తీసుకోవడం నేరం.. ఇది అనాదిగా చెప్పుకుంటూ వస్తున్నాం. వరకట్న దురాచారాన్ని రూపుమాపడానికి ఎంతోమంది సంఘసంస్కర్తలు ఎన్నో సంవత్సరాల పాటు కృషి చేశారు. అయినప్పటికీ వరకట్నమనే జాడ్యం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వరకట్నం కోసం వేధింపులు, హత్యలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ వరకట్నం ఇచ్చి పెళ్లి చేసినా అదనపు కట్నం కోసం వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వేధింపులకు సంబంధించి కేసులు కూడా భారీగానే నమోదవుతున్నాయి. అయినా జనాల బుద్ధి మాత్రం మారడం లేదు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also:Bhatti Vikramarka: ప్రభుత్వం మెడలు వంచి.. మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను
Also Read
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
- Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
హన్మకొండ గోపాలపూర్లో అత్తింటి వారు వేధిస్తున్నారంటూ ఓ మహిళ తన భర్త ఇంటి ముందే టెంట్ వేసుకుని నిరసన వ్యక్తం చేస్తోంది. బాధితురాలి పేరు శ్రీదివ్య తనకు ఆడపిల్ల పుట్టిందని ఐదేళ్లు తనకు నరకం చూపిస్తున్నారని ఆమె వాపోయింది. అత్తామామల వేధింపుల కారణంగానే తన తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని కన్నీరు మున్నీరైంది. పుట్టింది ఆడపిల్ల కావడంతో అదనపు కట్నం తీసుకురావాలని వేధించడం మొదలు పెట్టారని తెలిపింది. తనపై వేధింపులు అధికం చేసి.. తాను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి.. తను చనిపోయిన తర్వాత తన భర్తకు అధిక కట్నం తెచ్చే అమ్మాయితో మరో పెళ్లి చేయాలని చూస్తున్నట్లు ఆమె చెప్పింది.
Read Also:Hardik Pandya Note: చాలా కష్టంగా ఉంది.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం!
పోలీస్ లను పెద్దమనుషులను మేనేజ్ చేసుకొని విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయింది. తన భర్త పేరు కాశీ విశ్వనాథ్ అని.. అతడు ఇండియాన్ ఓవర్సీస్ బ్యాంక్ జనగామ బ్రాంచ్ మేనేజర్ అని.. ఇంట్లో ఉండడానికి వస్తే తన భర్త ఇంట్లో నుంచి మెడలు బట్టి బయటికి గెంటేశారని పేర్కొంది. తన తల్లి చనిపోవడంతో ప్రస్తుతానికి ఉండడానికి చోటు లేదని ఆవేదన చెందింది. తన బంధువులను.. కన్న బిడ్డ అన్న కనికరం కూడా లేకుండా బయటకు నెట్టేశారని తెలిపింది. మెట్టినింటి వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని.. దయ చేసి నన్ను నా పాపను కాపాడాలని వేడుకుంది.
తాజావార్తలు
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!