Damodara Rajanarsimha : మంత్రి దామోదర్ రాజనర్సింహ గారిని కలిసిన 317 జీవో బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ గారిని గత ప్రభుత్వ పాలన లో విడుదల చేసిన 317 జీవో ద్వారా ఇబ్బందులు ఎదుర్కుంటున్న బాధితులు హైదరాబాదులోని తన నివాసంలో కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా 317 జీవో బాధితులు మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి తమ సమస్యల పరిష్కారం పై రూపొందించిన వినతి పత్రాన్ని సమర్పించారు. గత ప్రభుత్వం నిరంకుశంగా, అసంబద్ధ నిర్ణయాలతో ఉద్యోగుల స్థానికతను గుర్తించకుండా, జోనల్ వ్యవస్థ ను తీసుకొచ్చి తమ జీవితాలతో చెలగాటం అడుకున్నారని మంత్రికి వెల్లడించారు. గత ప్రభుత్వం నిరంకుశ పాలన , అస్తవ్యస్త విధానాలతో ఉద్యోగులను, కుటుంబాలను అనేక ఇబ్బందులకు గురిచేశారని మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి బాధితులు మొరపెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో పై ఏర్పాటు అయిన క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా దామోదర రాజనర్సింహ గారిని నియమించినందుకు బాధితులు తమకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
317 జీవో బాధితులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రాన్ని సమర్పించి తమకు న్యాయం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకునే నిర్ణయం వల్ల రాష్ట్రంలోని ఉద్యోగులు , వారి కుటుంబాలతో పాటు తమ స్థానికత, పదోన్నతులు, బదిలీలు, స్పౌజ్ కేసుల సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రికి విజ్ఞప్తి చేశారు. 317 జీవో సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ లో బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతుగా చర్చిస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ బాధితులకు భరోసానిచ్చారు.
317 జీవో బాధితులు చేసిన విజ్ఞప్తి పై రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. ఉద్యోగుల సమస్యలను క్యాబినెట్ సబ్ కమిటీ లో అధ్యయనం చేసి న్యాయం చేస్తామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లో పునర్ సమీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు వెన్నంటి నిలుస్తుందన్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ గారిని కలిసిన వారిలో 317 బాదితులు రాపోలు శేఖర్, నిరీక్షణ, దీపిక, అనిత, గుగులోత్ మధు, రాథోడ్ కిరణ్, ఆలూరు మంజుల, పల్లవి లతోపాటు పలువురు బాధితులు ఉన్నారు.
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!