IND vs SA: టెస్టు అని ఎలా అనగలం?.. పిచ్ క్యురేటర్లపై స్టెయిన్ అసంతృప్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dale Steyn React on Cape Town Pitch: కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. కేవలం ఒకటిన్నర రోజుల్లో ఇరు జట్ల మధ్య 107 ఓవర్లు మాత్రమే పడ్డాయి. కేప్ టౌన్ పిచ్ మ్యాచ్ ప్రారంభం నుంచే ప్రమాదకరంగా మారింది. చాలా బంతులు బ్యాట్స్మెన్ పైకి వచ్చి ఇబ్బందులకు గురి చేశాయి. తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్లో ఐడెన్ మార్క్రమ్ మినహా ఎవరూ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్గా ఇది నిలిచిపోయింది. దీంతో కేప్ టౌన్ పిచ్పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ పిచ్పై దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇలాంటి పిచ్ను తయారు చేయడం వల్ల అంతర్జాతీయ క్రికెట్లో తమ దేశంపై విమర్శలు వస్తున్నాయని డేల్ స్టెయిన్ ఆవేదన వ్యక్తం చేశారు. సిడ్నీ, పెర్త్ పిచ్లలో పగుళ్లు ఉన్నా.. అక్కడ 4-5 రోజుల వరకు మ్యాచ్ సాగుతుందని.. కనీసం ఒక్క క్రాక్ లేకుండా మ్యాచ్ ముగియడం వల్ల ఏం లాభం అని విమర్శించాడు. ‘పిచ్పై పగుళ్లు వస్తే మేం ఎందుకు భయపడతాం?. సిడ్నీ, పెర్త్ పిచ్లపై పగుళ్లు ఉంటాయి. ఆ పగుళ్ల మధ్య కారును కూడా పార్క్ చేయొచ్చు. అయినా కూడా ఆ పిచ్లపై మ్యాచ్లు 4-5 రోజుకు వెళ్తాయి. కనీసం ఒక్క క్రాక్ లేకుండా.. మ్యాచ్ ఇంత వేగంగా ముగియడం వల్ల ఏం లాభం. సమయం గడిచే కొద్దీ పిచ్లో మార్పులు రావాలి. రెండు రోజుల్లోపే మ్యాచ్ ముగిస్తే.. దానిని టెస్టు అని ఎలా అంటాం?. ఈ టెస్ట్ మ్యాచ్ అర్ధంలేనిది’ అని ఎక్స్లో పేర్కొన్నాడు.
Also Read
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
- Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
Also Read: Kapil Dev Birthday: కపిల్ దేవ్ బర్త్ డే.. రజనీకాంత్ ‘లాల్ సలామ్’ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్!
రెండో టెస్టు మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. ‘ఇది కూడా క్రికెట్ పిచే, ఆడింది మ్యాచే. ఈ పిచ్పై ఏం జరిగిందో అందరం చూశాం. మ్యాచ్ రిఫరీలకు, ఐసీసీకి ఏం జరిగిందో తెలుసనుకుంటున్నా. ఈ పిచ్కు ఏ రేటింగ్ ఇస్తారు?. ఐసీసీ, మ్యాచ్ రిఫరీలు తటస్థంగా ఉండాలి. ఇక నుంచైనా భారత పిచ్లపై నోరుపారేసుకోవడం ఆపేయండి’ అని రోహిత్ అన్నాడు. కేప్టౌన్లో విజయంతో సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ టెస్టు సిరీస్ను డ్రా చేసుకోవడం ఇది రెండోసారి మాత్రమే. 2010/11 సీజన్లో ఎంఎస్ ధోనీ ఈ ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్.
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!