Health Tip : మీరు రోజు ఇడ్లీ, దోశ తింటున్నారా.. అయితే మీకు ఈ వ్యాధి తప్పదట..!
రోజూ మూడు పూటలా అన్నం తింటే లావు అయిపోతాము. అదిగో ఆ ఆలోచన నుంచి మనకి దిగుమతి అయిందే, ఉదయం పూట అవగాహనం పేరిట టిఫిన్లు తినటం. పాత కాలంలో మన పెద్దలు అయితే పొద్దుగాల్నే, శరీరానికి మంచి పోషకాలను ఖండపుష్టిని ఇచ్చే ఆహారాన్ని తీసుకునేవాళ్ళు. అందులో ముఖ్యంగా పెరుగులో సద్దన్నం, జొన్న గటక, రాగి సంగటి పోషకాల పరంగా వెలకట్టలేని ఆహారాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత అందరూ మూడు పూటలు అన్నం తినటం అలవాటు అయ్యింది. ఇలా కొద్ది కాలం నడిచిన తర్వాత లైఫ్ స్టైల్ ఛేంజ్ అయ్యి పొద్దున్నే అన్నం తింటే లావు అయిపోతాం అనే ఫీలింగ్ వచ్చేసింది. అన్నం మానేసి టీ, కాఫీ తాగితే ఆకలిని చంపేయోచ్చు అన్న ఆలోచనలో ఉన్నారు జనాలంతా. అలాగే టిఫిన్స్ అయిన ఇడ్లీ, దోశ, వడ ఇలాంటివి తినటం వలన కూడా ఆకలి చచ్చిపోతుందట. అంతే కాదు ఇవి రోజు తినటం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది. ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు గానీ, రోజూ అత్యంత భారమైన ఈ ఆయిల్ ఫుడ్ తినకూడదు. ఉదయం కొద్దిగా మజ్జిగ లేదా పెరుగుతో లైగా తినాలట. అలాగే మధ్యాహ్నానానికి బిర్రుగా కడుపు నిండా తినాలి.
అలాగే నైట్ కూడా తేలికగా తినటం వలన ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది ఉపవాసం ఉంటారు. అంటే రాత్రివేళ అన్నం మానేస్తారు. అటువంటి అలవాట్లు ఉన్నవాళ్ళు ఆ సమయంలో ఇడ్లీ, దోశ, బోండాలు, చపాతీ, పరోటాలు వంటివి లాగిచ్చేస్తుంటారు. కానీ అలా చేయటం వలన సాధారణంగా అన్నం తిన్న దానికంటే ఎక్కువ శరీరానికి నష్టం కలుగుతుంది. నైట్ పండ్లను తినాలి కానీ ఇప్పుడు అందరూ టిఫిన్స్ను ఫలహారాలు అని తినేస్తున్నారు.
Also Read
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
అయితే మిగతా టిఫిన్స్తో పోలిస్తే ఇడ్లీ మంచిదే. కానీ దీంట్లో సాంబారు, అల్లం చట్నీ, కారం, నెయ్యి ఇలా అన్నిటిని కలిపి తినటం వలన కడుపులో యాసిడిటీ పెరిగిపోతుంది. అలాగే బియ్యం కంటే మినపప్పు లో ఎక్కువ కాలరీలు ఉంటాయి. ఇవి షుగర్ను పెంచుతాయి. ఇలా ప్రతి రోజు టిఫిన్స్ తినడం వలన పేగులు తన శక్తిని కోల్పోతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింటుంది. వాత వ్యాధులు, కీళ్ల నొప్పులు ఇలాంటివి వస్తాయి. కాబట్టి వారానికి ఒకటి రెండు సార్లే టిఫిన్స్ను పరిమితం చేయాలి. ఉదయం వేళ పెరుగన్నం ఇంకా రాత్రి మిగిలిన అన్నాన్ని పెరుగులో కలిపి పెట్టుకొని మార్నింగ్ తినటం. లేదంటే మొలకెత్తిన గింజలు, పండ్లు, ఖర్జూరాలు వంటివి తినటం అలవాటు చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ ఆరోగ్యంలో అనూహ్యమైన మార్పులు గమనించొచ్చు. మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కానీ నిత్యం ఇడ్లీ, దోస, వడ. పూరి, పరోటలాంటివి దీర్ఘకాలంగా తింటే పది పదిహేను ఏళ్లుగా తింటున్న వారికి షుగర్ వ్యాధి వచ్చేస్తుంది.
తాజావార్తలు
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో