NTV Telugu Site icon

PKL 11: మరోసారి నిరాశపరిచిన తెలుగు టైటాన్స్..

Pkl

Pkl

ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్-దబాంగ్ ఢిల్లీ కేసీ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ మరోసారి ఓటమి పాలైంది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో 37-41 పాయింట్ల తేడాతో దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది.

Read Also: DGP Daughter Marriage: డీజీపీ కుమార్తె వివాహం.. వధూవరులను ఆశీర్వదించిన మంత్రులు

దబాంగ్ ఢిల్లీ కేసీ జట్టులో అత్యధికంగా రైడర్లు నవీన్ కుమార్, అశు మాలిక్ 15 పాయింట్లు సాధించారు. తెలుగు టైటాన్స్ జట్టులో పవన్ సెహ్రావత్ అత్యధికంగా 18 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. ఆ తర్వాత.. ఆశిష్ నర్వాల్ 9, విజయ్ మాలిక్ 3 పాయింట్స్‌తో సపోర్ట్ చేసినప్పటికీ మ్యాచ్ చేజారింది. చివరిలో ఇరు జట్ల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఈ టఫ్ ఫైట్ లో దబాంగ్ ఢిల్లీదే పైచేయి అయింది. దబాంగ్ ఢిల్లీ కేసీ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చింది. అటు.. తెలుగు టైటాన్స్ కూడా ఆల్ రౌండ్ ప్రదర్శన చేసినప్పటికీ మరో ఓటమిని మూటకట్టుకుంది. కాగా.. మొదటి మ్యాచ్‌లో విజయం సాధించిన తెలుగు టైటాన్స్ వరుసగా ఓటమి పాలవుతుంది.

Read Also: Mahesh Kumar Goud : కేటీఆర్‌తో ఉన్నవారు మాతో టచ్‌లో ఉన్నారు.. కాంగ్రెస్‌లో చేరికలు ఉంటాయి