Betting Racket: పోలీసుల దెబ్బకు బెట్టింగ్ రాయుళ్ల ముఠాకు చెక్మేట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Betting Racket: వాళ్లంతా బాగా చదువుకున్నారు.. ఒక్కొక్కరు ఇంజనీరింగ్లు పూర్తిచేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. మంచి MNC కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీళ్లకు డబ్బు ఆశ ఉంది. అది చివరికి వాళ్లను కటకటాల వెనక్కి నెట్టేసింది. ఈజీగా డబ్బు సంపాదించేందుకు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయడం మొదలు పెట్టారు కొంత మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. మంచి వాక్చాతుర్యం ఉన్న నలుగురు.. ఏకంగా టెలిగ్రామ్ యాప్లో ప్రత్యేకంగా గ్రూపులను తయారు చేసి ఆ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఒక్కొక్కరికి లక్షల కొద్ది వ్యూస్ వచ్చాయి. ప్రతి మ్యాచ్కి సంబంధించి బెట్టింగ్ పెట్టమని చెప్పేవారు. మ్యాచ్లో సదర్ టీంపై బెట్టింగ్ పెడితే గెలుస్తుందని చెప్పేవారు. అందుకు సంబంధించి తాము ఎంత పెట్టుబడి పెట్టామన్నది కూడా తెలిపేవారు.
Read Also:Golden Gang Arrest: దొంగలకే దొంగ.. గజ దొంగ.. గోల్డెన్ గ్యాంగ్ అరెస్ట్..!
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్పై నిషేధం ఉంది. అయినప్పటికీ కూడా వీళ్లు ఇతర దేశాల ఐపీ అడ్రస్లను వినియోగించి బెట్టింగ్ యాప్ లని ప్రమోషన్ చేశారు. ఇలా రెండు నెలల కాలంలో నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏకంగా రెండు కోట్లకి పైగా సంపాదించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ కమీషన్లు ఆర్జిస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లను సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. చిన్నంశెట్టి నాగ రాకేశ్, పి.దీపక్, గుగులోత్ శ్రీరామ్ నాయక్, హేమంత్ కుమార్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 10 సెల్ఫోన్లు, 2 ల్యాప్టాప్స్, ఏటీఎం కార్డులు, బ్యాంకు బుక్ లను స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ సాయి శ్రీ తెలిపారు.
Read Also:Drugs Federals: డ్రగ్ పెడ్లర్ గేమ్ ఓవర్.. డ్రగ్స్ దందా ముఠా అరెస్ట్..!
టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో నిందితులు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నట్టు గుర్తించామన్నారు. నిందితులకు 10 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. బెట్టింగ్ వల్ల ఓ యువకుడు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. కమీషన్తో ఒక్కొక్కరు 50 లక్షలు సంపాదించినట్టు గుర్తించామన్నారు పోలీసులు. బెట్టింగ్లో తెలుగు ప్రజలే లక్ష్యంగా ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. 2019 నుంచి వీరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. 10 విదేశీ వెబ్సైట్లను నిందితులు ప్రమోట్ చేస్తున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నాని డీసీపీ తెలిపారు. 10 విదేశీ వెబ్ సైట్లను నిందితులు ప్రమోట్ చేస్తున్నారు. నిందితులు ఎవరికీ చిక్కకుండా తెలివిగా డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి మోసం చేస్తూ.. 13శాతం కమిషన్ తీసుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దందాతో 80 లక్షలు అక్రమంగా సంపాదించినట్టు తెలిపారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!