Cyber Crime: క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అని బెదిరించి రూ.1.48 కోట్లకు టోకరా.. ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ యుగంలో సాంకేతికత వినియోగం చాలా పనులను సులభతరం చేసింది. అయితే నేరస్థులు తమ అక్రమాలకు కూడా ఈ టెక్నిక్లను ఉపయోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇలాంటి ఉదంతం వెలుగులోకి చూసింది. సోషల్ మీడియా ద్వారా ఓ మహిళను రూ.1 కోటి 48 లక్షలు మోసం చేశారు నేరగాళ్లు. దుండగులు మహిళను మూడు రోజుల పాటు ఆమె ఇంట్లో డిజిటల్ గృహనిర్బంధంలో ఉంచారు.
READ MORE: India-Russia: భారత్పై అమెరికా విమర్శలు.. ఖండించిన రష్యా..!
Also Read
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
- Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
పోలీసుల కథనం ప్రకారం.. ప్రయాగ్రాజ్లోని జార్జ్ టౌన్ ప్రాంతంలో కకోలి దాస్ అనే వృద్ధురాలు నివసిస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్న ఆమె భర్త చాలా ఏళ్ల క్రితం చనిపోయాడు. ఒక కుమార్తె ఉంది, ఆమె విదేశాలలో ఉంటుంది. కకోలి తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఏప్రిల్ 23న ఆమెకు ఓ నంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ చేస్తున్న వ్యక్తి తనను తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా పరిచయం చేసుకున్నాడు. ఆమెను నమ్మించేందుకు వీడియో కాల్ చేసి పోలీసు డ్రెస్ లో కనిపించాడు. తైవాన్ నుంచి మీ పేరు మీద పార్శిల్ వచ్చిందని, అందులో 200 గ్రాముల (MDMA) డ్రగ్, 3 క్రెడిట్ కార్డ్లు, 5 ల్యాప్టాప్లు ఉన్నాయని కకోలి దాస్కి చెప్పాడు. మేము మీ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయాలని, మీరు సహకరించాలని చెప్పాడు. ఆ తర్వాత మహిళ బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకుని పత్రాలపై సంతకాలు చేశాడు. కొద్దిసేపటికే కకోలి దాస్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.1 కోటి 48 లక్షలు మాయమయ్యాయి. విచారణ పూర్తయ్యే వరకు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించడంతో ఆ వృద్ధురాలు మూడు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయారు.
నాలుగు రోజుల తర్వాత, బాధితురాలు కాకోలి దాస్ మోసానికి గురైనట్లు గుర్తించి ప్రయాగ్రాజ్లోని జార్జ్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి ఏ ఖాతాకు నగదు బదిలీ చేశారో తెలుసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ సైబర్ దుండగులకు బ్యాంకాక్, థాయ్లాండ్, నేపాల్ దేశాలతో కూడా సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది. అరెస్టయిన వారిలో అమర్పాల్, మిథిలేష్ , కుమార్, రాజేష్ కుమార్ ఉన్నారు.
- Tags
- Amarpal
- bangkok
- cyber crime
- Kumar
- MDMA
తాజావార్తలు
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
-
Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!