Cyber Crime: క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అని బెదిరించి రూ.1.48 కోట్లకు టోకరా.. ఎక్కడంటే..?
డిజిటల్ యుగంలో సాంకేతికత వినియోగం చాలా పనులను సులభతరం చేసింది. అయితే నేరస్థులు తమ అక్రమాలకు కూడా ఈ టెక్నిక్లను ఉపయోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇలాంటి ఉదంతం వెలుగులోకి చూసింది. సోషల్ మీడియా ద్వారా ఓ మహిళను రూ.1 కోటి 48 లక్షలు మోసం చేశారు నేరగాళ్లు. దుండగులు మహిళను మూడు రోజుల పాటు ఆమె ఇంట్లో డిజిటల్ గృహనిర్బంధంలో ఉంచారు.
READ MORE: India-Russia: భారత్పై అమెరికా విమర్శలు.. ఖండించిన రష్యా..!
Also Read
- 8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..
- Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
- Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
- CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
పోలీసుల కథనం ప్రకారం.. ప్రయాగ్రాజ్లోని జార్జ్ టౌన్ ప్రాంతంలో కకోలి దాస్ అనే వృద్ధురాలు నివసిస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్న ఆమె భర్త చాలా ఏళ్ల క్రితం చనిపోయాడు. ఒక కుమార్తె ఉంది, ఆమె విదేశాలలో ఉంటుంది. కకోలి తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఏప్రిల్ 23న ఆమెకు ఓ నంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ చేస్తున్న వ్యక్తి తనను తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా పరిచయం చేసుకున్నాడు. ఆమెను నమ్మించేందుకు వీడియో కాల్ చేసి పోలీసు డ్రెస్ లో కనిపించాడు. తైవాన్ నుంచి మీ పేరు మీద పార్శిల్ వచ్చిందని, అందులో 200 గ్రాముల (MDMA) డ్రగ్, 3 క్రెడిట్ కార్డ్లు, 5 ల్యాప్టాప్లు ఉన్నాయని కకోలి దాస్కి చెప్పాడు. మేము మీ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయాలని, మీరు సహకరించాలని చెప్పాడు. ఆ తర్వాత మహిళ బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకుని పత్రాలపై సంతకాలు చేశాడు. కొద్దిసేపటికే కకోలి దాస్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.1 కోటి 48 లక్షలు మాయమయ్యాయి. విచారణ పూర్తయ్యే వరకు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించడంతో ఆ వృద్ధురాలు మూడు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయారు.
నాలుగు రోజుల తర్వాత, బాధితురాలు కాకోలి దాస్ మోసానికి గురైనట్లు గుర్తించి ప్రయాగ్రాజ్లోని జార్జ్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి ఏ ఖాతాకు నగదు బదిలీ చేశారో తెలుసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ సైబర్ దుండగులకు బ్యాంకాక్, థాయ్లాండ్, నేపాల్ దేశాలతో కూడా సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది. అరెస్టయిన వారిలో అమర్పాల్, మిథిలేష్ , కుమార్, రాజేష్ కుమార్ ఉన్నారు.
- Tags
- Amarpal
- bangkok
- cyber crime
- Kumar
- MDMA
తాజావార్తలు
-
8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..
-
Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
-
Mohsin Khan: “మెయిడెన్ ఓవర్.. ఆపై వికెట్”.. వైభవ్ జోరుకు బ్రేక్ వేసిన లక్నో పేసర్.. మునుపెన్నడూ జరగలే!
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
-
CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?