CSK vs KKR: ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను: చెన్నై కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ruturaj Gaikwad on Strike Rate: తన స్ట్రైక్ రేట్ గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. పిచ్ చాలా స్లోగా ఉందని, కాస్త ఆచూతుచి ఆడాల్సి వచ్చిందన్నాడు. తమ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారని, దాంతోనే ప్రత్యర్ధిని తక్కువే స్కోరుకే కట్టడి చేశాం అని పేర్కొన్నాడు. చెన్నై జట్టులో ఎవరికి ఎటువంటి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రతీ ఒక్కరికి వారి రోల్పై ఒక క్లారిటీ ఉందని రుతురాజ్ చెప్పుకొచ్చాడు. వరుసగా రెండు ఓటుములు చవిచూసిన చెన్నై తిరిగి పుంజుకుంది. సోమవారం చెపాక్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ… ‘విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. ఐపీఎల్లో నా తొలి అర్ధ సెంచరీ సాధించడం ఇంకా గుర్తుంది. అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితే. అప్పుడు ధోనీ భాయ్ నాతో ఉన్నాడు. ఇద్దరం కలిసి మ్యాచ్ను మగించాము. ఈ రోజు కూడా అలానే జరిగింది. అజింక్య రహానే గాయపడటంతో చివరి వరకు క్రీజులో ఉండటమే నా బాధ్యతగా భావించాను. పిచ్ చాలా స్లోగా ఉంది. సిక్సులు కొట్టే పిచ్ ఇది కాదు. స్ట్రైక్ రొటేట్ చేసి బౌండరీలు కొడితే.. 150-160 పరుగులు చేయొచ్చు. మా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్ధిని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు’ అని అన్నాడు.
Also Read
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
Also Read: MS Dhoni: కోల్కతాపై చెన్నై విజయం.. ఎంఎస్ ధోనీ ఆనందం చూశారా?
‘రవీంద్ర జడేజా బంతితో మ్యాజిక్ చేశాడు. సహజంగా పవర్ప్లే తర్వాత జడ్డూ ఎటాక్లోకి వస్తాడు. ఇన్నేళ్లుగా మేం అనుసరిస్తున్నది అదే. చెన్నై జట్టులో ఎవరికి సూచనలు, సలహాలు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరూ గొప్ప ప్లేయర్స్ ఉన్నారు. ప్రతీ ఒక్కరికి వారి రోల్పై ఒక క్లారిటీ ఉంది. మహి భాయ్,ఫ్లెమింగ్ జట్టుతోనే ఉన్నారు. ఇక ఈ మ్యాచ్లో నా ఇన్నింగ్స్ను స్లోగా ఏమీ ప్రారంభించలేదు. టీ20లో మనం ఎదుర్కొనే తొలి 2-3 బంతులు చాలా ముఖ్యం. ఎందుకంటే దూకుడుగా ఆడి వికెట్ కోల్పోతాము. ఈరోజు కాస్త సమయం తీసుకుని ఆడా. నా స్ట్రైక్ రేట్ గురించి ఎవరు ఏమి మాట్లాడుకునా నేను పట్టించుకోను’ అని రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. గైక్వాడ్ 58 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!