Ambati Rayudu: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక ప్రకటన చేశాడు. త్వరలో దుబాయ్ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ఆడనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అయితే, ఈ టోర్నీలో పాల్గొనే ప్రొఫెషనల్ ఆటగాళ్లకు ఎలాంటి రాజకీయ సంబంధాలు ఉండకూడదన్న నిబంధన ఉందని వివరణ ఇచ్చాడు. ఈ నెల 20 నుంచి మొదలయ్యే ఐఎల్ టీ20లో ముంబై ఎమిరేట్స్ కు ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపాడు. గతంలోనూ ఐసీఎల్ లోనూ ముంబై ఇండియన్స్ తరుఫున ఆడాడు.
Read Also: Breaking News: మోడీపై అవమానకర వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
కాగా.. ట్విట్టర్ వేదికగా క్రికెట్ లోకి పున:ప్రవేశించినట్లు అంబటి రాయుడు తెలిపాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రొఫెషనల్ టీ20 క్రికెట్ లీగ్ తొలి సీజన్ 2023లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 12 వరకు జరిగింది. ఇందులో 6 జట్లు అబుదాబి నైట్ రైడర్స్, దుబాయ్ క్యాపిటల్స్, డిసర్ట్ వైఫర్స్, గల్ఫ్ జేయింట్స్, ముంబై ఎమిరేట్స్, షార్జా వారియర్స్ జట్లు పోటీపడుతున్నాయి.
I Ambati Rayudu will be representing the Mumbai Indians in the upcoming ILt20 from jan 20th in Dubai. Which requires me to be politically non affiliated whilst playing professional sport.
— ATR (@RayuduAmbati) January 7, 2024
Read Also: Central Election Commission: ఏపీలో ఎన్నికల సందడి.. రేపటి నుంచి రాష్ట్రంలో సీఈసీ పర్యటన