Dr. Gedala Srinubabu : ఆధునిక లాభసాటి వ్యవసాయం వైపు `సాగు`దాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ సీడ్స్తో అగ్రిప్రెన్యూర్ షిప్ సాధ్యం అవుతుందని పల్సస్ సీఈవో డా. గేదెల శ్రీనుబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో వేలాది మంది రైతులతో జరిగిన సమావేశంలో `విజన్ ఫర్ అగ్రిప్రెన్యూర్షిప్ ఇన్ నార్త్ ఆంధ్ర`ని శ్రీనుబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గేదెల శ్రీనుబాబు వ్యవసాయరంగంలో అగ్రిప్రెన్యూర్షిప్ , డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ గురించి వివరించారు. సంప్రదాయ వ్యవసాయం కనుమరుగవుతున్న దశలో, రైతులు తమ క్షేత్రాలను వీడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగువిస్తీర్ణం తగ్గడం ప్రమాద సంకేతం అని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి, ప్రతి ఇంటా లాభాల పంట పండించడానికి వ్యవసాయానికి డిజిటల్ మార్కెటింగ్ అనుసంధానమే అసలు సిసలు పరిష్కారం అని చెప్పారు.

Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
అగ్రికల్చర్ నుంచి బిజినెస్ కల్చర్ వైపు..
ఆరుగాలం కష్టించి పనిచేసే రైతుని ఉద్దేశించి బురద బుక్కి బువ్వ పెడతాడంటారు. అన్నదాత అని కొనియాడుతారు. కానీ సంప్రదాయ వ్యవసాయం, యాంత్రీకరణకి చొరవ లేకపోవడం, అందివచ్చిన డిజిటల్ కాలంలో ప్రపంచం ఒక కుగ్రామం అయినా మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు వ్యవసాయాన్ని వీడుతున్నారు. అగ్రికల్చర్ని వీడకుండా అక్కడి నుంచే బిజినెస్ కల్చర్ వైపు రైతుల్ని పరివర్తన చేయడం ద్వారా “వ్యవసాయ విప్లవం సాధ్యం అవుతుందన్నారు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యవసాయాన్ని అగ్రిప్రెన్యూర్షిప్గా మార్చడానికి అవసరమైన రోడ్మ్యాప్ను శ్రీకాకుళంలో వేదికగా పల్సస్ సీఈవో ఆవిష్కరించారు.

డిజిటల్ సీడ్స్:
అగ్రిబిజినెస్లో డిజిటల్ మార్కెటింగ్ దే కీలకపాత్ర అని శ్రీనుబాబు వివరించారు. విత్తనాలు వేసి పంటలు పండించే రైతులు, ఇకపై డిజిటల్ విత్తనాలు వేయడం ద్వారా లాభాల పంటలు పండించుకోవచ్చన్నారు. డిజిటల్ విత్తనాలు అంటే నాటేవి కాదని, వ్యవసాయానికి డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్ని అనుసంధానించడమేనన్నారు. ప్రతి రైతు పారిశ్రామికవేత్త స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ విప్లవానికి శ్రీకాకుళంలో శ్రీకారం చుట్టామని, ఇది ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరిస్తే వ్యవసాయ విప్లవం వచ్చి నూతన శకానికి నాంది పలుకుతుందన్నారు.
అగ్రిప్రెన్యూర్ షిప్ కోసం తాము తలపెట్టిన రైతు సాధికారత యాత్రలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో జరిగాయని..తెలిపారు. తాను ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్ని పదివేల మందికి పైగా రైతులకు చేరవేశామన్నారు. శ్రీకాకుళం సభలో రైతులు, వారి కుటుంబాలు వేలాదిమంది హాజరై భవిష్యత్ వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చుకునే ప్రణాళికలు పాటిస్తామన్నారు.
తాజావార్తలు
-
Vivo V80 Lite 5G: వివో వి80 లైట్ 5జీ వచ్చేసింది.. 10,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 16GB వరకు RAM!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే అంతే సంగతులు!
-
Duniya Vijay: పెళ్లి బంధానికి గుడ్బై చెప్పిన విజయ్.. విడాకులు తీసుకున్న స్టార్ హీరో!
-
GSLV-F17: ISRO మరో ఘన విజయం.. GSLV-F17 ప్రయోగం సక్సెస్.. EOS-05 ఉపగ్రహం ఏం చేస్తుంది? భారత్కు ఎలా ఉపయోగపడుతుంది?
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్స్.. ఆలియా భట్, షాహిద్ కపూర్ స్పెషల్ రోల్స్లో?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!