Prakash Karat : కేంద్ర సర్కారు అదానీ, అంబానీల ప్రభుత్వం అయిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత తొమ్మిదేళ్ళలో మోదీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి దేశాన్ని లూటీ చేసిందని ఆరోపించారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కేంద్ర సర్కారు అదానీ, అంబానీల ప్రభుత్వం అయిపోయిందన్నారు. అదానీ, అంబానీల ప్రభుత్వాన్ని కుల్చాల్సిన అవసరం ఉందని, మోదీ ప్రభుత్వం సహజ వనరులను అదానీ, అంబానిలకు కట్టబెడుతుందన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏ అంశం చర్చించకుండా వాయిదాలు వేస్తున్నారని, అదానీ అక్రమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని, అదానీ అక్రమ ఆస్తులపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పకుండా సభను వాయిదా వేస్తున్నారన్నారు. గౌతం అదానీని కాపాడేందుకు మోడీకి ఎందుకు అంత తాపత్రయమని, మోదీ ప్రధాని అయ్యాక అదానీ అస్తి 50వేల కోట్ల నుంచి 10లక్షల కోట్లకు పెరిగిందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బడా పెట్టుబడిదారులు సహజ వనరులను శాసిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పేదలపైన పన్నులు వేస్తున్నారు తప్పితే.. సంపన్నులపై పన్నులు వేయడం లేదని, గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులపైన కోత విధించారన్నారు.
Also Read : IPL 2023 : ప్రతి టీమ్ లో ముగ్గురు కొత్త ప్లేయర్స్..
Also Read
- India vs Zimbabwe: ఇంగ్లండ్లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
- 6 ఏళ్ల తర్వాత 'S' సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మతవిద్వేషాలు రెచ్చ గొడుతున్నారని, హిందుత్వ ముసుగులో అదానీ, అంబానీ కోసం పని చేస్తూ సామాన్య ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. రాజ్యాంగంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేస్తోందని, లాల్ ప్రసాద్ యాదవ్, కవిత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిపై ఈడీ, సీబీఐతో దాడులు చేయించిందన్నారు. అంతేకాకుండా.. ‘ప్రతిపక్ష రహిత దేశంగా మార్చాలని మోదీ లక్ష్యమని, బీజేపీ..భారతీయ జనతా వాషింగ్ మెషిన్ గా మారిపోయింది. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మపై అవినీతి కేసు బిజెపి లో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయింది. మోదీ కార్పొరేట్ విధానాలపై ఉదృతమైన పోరాటాలు నిర్వహించాల్సి ఉంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దక్షిణాదిలో తెలంగాణను లక్ష్యంగా చేసుకుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు పన్నుతోంది. వామపక్ష, లౌకిక శక్తులు బిజెపి అధికారంలోకి రాకుండా నిరోధించాలి. బీజేపీ మత చిచ్చు కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
Also Read : Priyanka Chopra: అమెరికా వెళ్లగానే కళ్ళు కనిపించడం లేదా.. ఆర్ఆర్ఆర్ నే అవమానిస్తావా..?
తాజావార్తలు
-
India vs Zimbabwe: ఇంగ్లండ్లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
-
Guru Purnima 2026: గురు పౌర్ణమి జూలై 28నా? 29నా? సరైన తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం ఇదే
-
Jananayagan : విజయ్ ‘జననాయకుడు’ ఓవర్సీస్ రివ్యూ.. వద్దు బ్రో
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!