Ramakrishna: ఎన్డీఏ కూటమిని ఓడించడమే మన లక్ష్యం కావాలంటూ పిలుపునిచ్చారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీపీఐ, కాంగ్రెస్, ఇండియా కూటమి అభ్యర్థిగా ఈ రోజు కోటేశ్వరరావు నామేషన్ దాఖలు చేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్టంలో.. దేశంలో అతి కీలక మైన ఎన్నికలు జరుగుతున్నాయి .. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి డబ్బు సంచులు పట్టుకొని కొంతమంది వ్యాపారస్తులు వచ్చారని ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు.. ఇక, బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థి సుజనా చౌదరి కొండలు ఎక్కలేడంటూ సెటైర్లు వేసిన ఆయన.. ఈ ప్రాంత ప్రజలతో పరిచయాలు లేని వ్యక్తి సుజనా చౌదరి.. ఈ ఎన్నికల్లో సామాన్యుడైన కోటేశ్వరరావుని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.. గతంలో కార్పొరేటర్ గా చేసినా అనుభవం కలిగిన వ్యక్తి కోటేశ్వరరావు.. అసెంబ్లీకి పంపిస్తే.. ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుందన్నారు. ఇక, దేశంలో ఉన్న ధనవంతులందరూ అసెంబ్లీలోనే ఉన్నారని.. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడమే మన లక్ష్యంగా ఉండాలని.. అందుకు ఇండియా కూటమిలోని ప్రతీ ఒక్కరు తమ శక్తి మేర పనిచేయాలని పిలుపునిచ్చారు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కాగా, దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో పొత్తుల్లో భాగంగా పనిచేస్తున్న సీపీఎం, సీపీఐ.. ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తోన్న విషయం విదితమే.
Ramakrishna: ఎన్డీఏ కూటమిని ఓడించడమే మన లక్ష్యం..

Cpi Ramakrishna