CP Ranganath : ఆటో కన్సల్టెన్సీ, స్క్రాప్ డీలర్లు నిజాయితీగా వ్యాపారం చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆటో కన్సల్టెన్సీ, స్క్రాప్ డీలర్లు నిజాయితీగా వ్యాపారం చేయాలని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ (సీపీ) ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు నష్టం వాటిల్లుతున్నందున చోరీ వాహనాలను కొనడం మానుకోవాలని డీలర్లకు సూచించారు.
Also Read : Bigg Boss Telugu 7: ఎవరి ఊహకు అందని సీజన్.. నాగ్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడే
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
చోరీకి పాల్పడిన వాహనాలను కొనుగోలు చేసే డీలర్లపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వివరాలతో ముందుకు వస్తే పోలీసుల వేధింపులు ఉండవని హామీ ఇచ్చారు. గురువారం భీమారంలోని ఓ ఫంక్షన్ హాల్లో డీలర్లతో సమావేశం నిర్వహించి చోరీకి పాల్పడిన ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయడం వల్ల దొంగలకు ఏవిధంగా సహాయం చేసి బాధితులు ఆర్థికంగా నష్టపోతున్నారో వ్యాపారులకు వివరించారు.
Also Read : K.A.Paul: ఏపీ రాజకీయాలపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు
డబ్బు సంపాదనే ధ్యేయంగా దొంగ వాహనాలను కొనుగోలు చేయడం తగదన్నారు. చోరీ వాహనాల విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డీలర్లను సీపీ ఆదేశించారు. “ఏదైనా వాహనం కొనుగోలు చేసే సమయంలో విక్రేత సెల్ఫోన్ నంబర్తో పాటు ఆధార్ వంటి గుర్తింపు కార్డులను తీసుకోండి. అతని/ఆమె గుర్తింపును ధృవీకరించడానికి విక్రేతకు ఫోన్లో కాల్ చేయండి. వాహనాల కొనుగోలు, విక్రయాలకు సంబంధించి మార్గదర్శకాలను అనుసరించండి.
వారు కొనుగోలు చేసిన, విక్రయించే అన్ని వాహనాల రికార్డులను సృష్టిస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటేనే వాహనాలను కొనుగోలు చేయాలి. తమ వ్యాపార కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశానికి హాజరైన పలువురు ఆటో కన్సల్టెన్సీ, స్క్రాప్ డీలర్లు సీపీ చొరవను స్వాగతించారు. నిబంధనల ప్రకారం నడుచుకుంటామని హామీ ఇచ్చారు. డీసీపీ (క్రైం) డి.మురళీధర్, ఏసీపీలు ఎల్.రమేష్ కుమార్, మల్లయ్య, కిరణ్ కుమార్, డేవిడ్ రాజు, సతీష్, ఇతర సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!