Hyderabad: సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు సంచలన వీడియో విడుదల..
- సంధ్య థియేటర్ ఘటనపై వీడియో విడుదల చేసిన పోలీసులు
- బయట తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని అల్లు అర్జున్కు చెప్పేందుకు ప్రయత్నించాం
- మేనేజర్ తాను చెప్తా అన్నాడు..- ఏసీపీ రమేష్
- దయచేసి థియేటర్ నుంచి వెళ్లిపోండి అని అల్లు అర్జున్కు డీసీపీ నేరుగా వెళ్లి చెప్పారు- ఏసీపీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంధ్య థియేటర్ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఓ వీడియోను విడుదల చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీవీ ఆనంద్.. చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు నాయక్ వివరణ ఇచ్చారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనను వివరించారు. సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కేసులో న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామన్నారు. అల్లు అర్జున్ వద్దకు వెళ్లేందుకు ఎస్హెచ్వో కూడా తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందని సీపీ పేర్కొన్నారు. విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాత కానీ.. అల్లు అర్జున్ బయటకు రాలేదని సీపీ తెలిపారు.
Allu Arjun: 2 వేల కోట్లు కలెక్ట్ చేశారు.. బాధిత కుటుంబానికి రూ.20 కోట్లు ఇస్తే పోయేదేముంది: మంత్రి
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
ఏసీపీ రమేష్ మాట్లాడుతూ.. బయట తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది అనే విషయాన్ని అల్లు అర్జున్కి చెప్పేందుకు వెళ్తుండగా.. మేనేజర్ నేను చెప్తాను అన్నాడని అన్నారు. దయచేసి వెళ్ళండని అల్లు అర్జున్కు డీసీపీ నేరుగా వెళ్లి చెప్పారన్నారు. కానీ నేను సినిమా మొత్తం చూసిన తర్వాతే వెళ్తాను అని అల్లు అర్జున్ అన్నారన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట విషయం అల్లు అర్జున్ దృష్టికి తాను తీసుకువెళ్లానన్నారు. ఓ మహిళ చనిపోయింది.. బాబు సీరియస్ ఉన్నాడని అల్లు అర్జున్కు చెవిలో చెప్పాను.. నేను సినిమా చూశాకే వెళ్తాను అని అల్లు అర్జున్ తనకు చెప్పాడని అన్నారు. చిక్కడపల్లి సీఐ, రాజు నాయక్ మాట్లాడుతూ.. రేవతిని, చిన్న బాబు తేజను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించానని అన్నారు. ఎస్సై మౌనిక, తాను రేవతికి సీపీఆర్ చేశాం.. కాపాడేందుకు ప్రయత్నించామని చెప్పారు. కానీ తమ ముందే రేవతి ప్రాణాలు పోయాయని తెలిపారు. తొక్కిసలాటలో తన ప్రాణాలు కూడా పోయేవని సీఐ అన్నారు.
Abhijeet : “గాంధీ పాకిస్థాన్ కి పితామహుడు.. భారత్కి కాదు.” సింగర్ సంచలన వ్యాఖ్యలు
సీపీ వార్నింగ్:
సీపీ సీవీ ఆనంద్ బౌన్సర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్ను ఎక్కడైనా తోసివేస్తే తాట తీస్తామని అన్నారు. బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీనే భాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు. బౌన్సర్లను పెట్టుకున్న వాళ్ళదే పూర్తి బాధ్యత అని సీపీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!